Bangladesh: బంగ్లాదేశ్లో మైనార్టీలు అయిన హిందూవులపై దాడులు ఆగడం లేదు. లెటెస్ట్గా ఓ ఐదు ఇళ్లను తగులబెట్టారు దుండగులు. పిర్జోపూర్ జిల్లా దుమ్రితలా గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఎప్పుడైతే దీప్ చంద్రదాస్పై దాడి చేసి హత్య జరిగిందో.. అప్పటి నుంచి దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో.. చాలా మంది బంధువులు ఆ ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది. వారందరిని చూసిన కొందరు అల్లరిమూకలు.. వారి ఇంటికి నిప్పు పెట్టాయి. ఆ తర్వాత మంటలు తీవ్రంగా చెలరేగడంతో.. ఆ మంటలు చుట్టుపక్కల ఉన్న మరో నాలుగు ఇళ్లకు అంటుకున్నాయి.
ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని.. ఆస్తి నష్టం మాత్రం జరిగిందని అధికారులు చెబుతున్నారు. కానీ అసలు నిజాలేంటన్నది మాత్రం ప్రస్తుతానికి మిస్టరీనే అని చెప్పాలి. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామాగ్రి, నగదు, కీలకమైన డాక్యుమెంట్లు, సరిఫికేట్లు.. ఇలా అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు చెబుతున్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని.. ప్రమాదానికి కారణమేంటని ఇప్పటి వరకు తేలలేదు అని చెబుతున్నారు అధికారులు. అయితే కొందరు కావాలనే మంటలను అంటించారని.. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గడచిన నాలుగు నెలల్లో హిందూవులపై దాడులు జరిగిన ఘటనలు 71 వరకు రిపోర్ట్ అయ్యాయి. ఇది అధికారిక లెక్క. ఇంకా రిపోర్ట్ చేయని ఘటనలు చాలానే ఉంటాయని తెలుస్తోంది. మొత్తం 30 జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి.
ALSO READ: Eagle Team: న్యూఇయర్.. ఎవరైనా అలా చేస్తే అంతే సంగతులు, 150 మందితో..?: ఈగల్ ఎస్పీ సీతారాం