E-Paper
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టిన అల్లరిమూకలు.. మరీ ఇంత దారుణమా?

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టిన అల్లరిమూకలు.. మరీ ఇంత దారుణమా?
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీలు అయిన హిందూవులపై దాడులు ఆగడం లేదు. లెటెస్ట్‌గా ఓ ఐదు ఇళ్లను తగులబెట్టారు దుండగులు. పిర్జోపూర్ జిల్లా దుమ్రితలా గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఎప్పుడైతే దీప్‌ చంద్రదాస్‌పై దాడి చేసి హత్య జరిగిందో.. అప్పటి నుంచి దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో.. చాలా మంది బంధువులు ఆ ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది. వారందరిని చూసిన కొందరు అల్లరిమూకలు.. వారి ఇంటికి నిప్పు పెట్టాయి. ఆ తర్వాత మంటలు తీవ్రంగా చెలరేగడంతో.. ఆ మంటలు చుట్టుపక్కల ఉన్న మరో నాలుగు ఇళ్లకు అంటుకున్నాయి.

ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని.. ఆస్తి నష్టం మాత్రం జరిగిందని అధికారులు చెబుతున్నారు. కానీ అసలు నిజాలేంటన్నది మాత్రం ప్రస్తుతానికి మిస్టరీనే అని చెప్పాలి. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామాగ్రి, నగదు, కీలకమైన డాక్యుమెంట్లు, సరిఫికేట్లు.. ఇలా అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు చెబుతున్నారు.

Advertisement

ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని.. ప్రమాదానికి కారణమేంటని ఇప్పటి వరకు తేలలేదు అని చెబుతున్నారు అధికారులు. అయితే కొందరు కావాలనే మంటలను అంటించారని.. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గడచిన నాలుగు నెలల్లో హిందూవులపై దాడులు జరిగిన ఘటనలు 71 వరకు రిపోర్ట్ అయ్యాయి. ఇది అధికారిక లెక్క. ఇంకా రిపోర్ట్‌ చేయని ఘటనలు చాలానే ఉంటాయని తెలుస్తోంది. మొత్తం 30 జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి.

ALSO READ: Eagle Team: న్యూఇయర్.. ఎవరైనా అలా చేస్తే అంతే సంగతులు, 150 మందితో..?: ఈగల్ ఎస్పీ సీతారాం

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×