BigTV English

Pakistan Bus Accident, 28 people dead: పాక్‌లో దారుణమైన యాక్సిడెంట్, 28 మంది మృతి

Pakistan Bus Accident, 28 people dead: పాక్‌లో దారుణమైన యాక్సిడెంట్, 28 మంది మృతి

Pakistan Bus Accident, 28 people dead: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడిన ఘటనలో 28 మంది మృతి చెందగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందినవారి దేహాలు అక్కడే పడి ఉన్నాయి.


బలూచిస్థాన్ ప్రావిన్స్‌ వద్ద భారీ లోయలో పడిపోయింది బస్సు. టుర్బాట్ నుంచి క్వెట్టాకు బస్సు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమని అంచనా వేస్తున్నారు అధికారులు. చనిపోయినవారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్య్కూ టీమ్ సిబ్బంది ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు అతి వేగంగా వెళ్తున్న సమయంలో టైరు పంక్ఛర్ కావడంతో ఘటన జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.


 

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×