E-Paper
Advertisement

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 15 మంది దుర్మరణం, ఎన్నికల అభ్యర్థులతోపాటు రాజకీయ నేతలు

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 15 మంది దుర్మరణం, ఎన్నికల అభ్యర్థులతోపాటు రాజకీయ నేతలు
Advertisement

Plane Crash: ఈ మధ్యకాలంలో వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం మహారాష్ట్రలో విమాన ప్రమాదం జరిగి 24 గంటలు గడవకుందే మరొక విమానం కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 15 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన కొలంబియాలో చోటు చేసుకుంది.

కొలంబియాలో ఘోర విమానం ప్రమాదం

Advertisement

కొలంబియాలో ఘోర విమానం ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశంలో కుకుటా సిటీ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కంట్రోలింగ్ టవర్స్‌తో సిగ్నల్స్ తెగిపోయాయి. ఆ విమానంలో దాదాపు 13 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు విమానం సిబ్బంది ఉన్నారు. ఆదేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒకానా సిటీలో ల్యాండ్ కావాల్సివుంది. ఫ్లైట్ కూలిన ప్రాంతం వెనిజువెలాకు సరిహద్దున ఉంది.

ఆ ప్రాంతం పర్వతాలతో కూడి ఉండడం ఒకటైతే, వాతావరణం సరిగ్గా లేకపోవడం మరొక కారణం. ఆ విమానంలో ఆ దేశానికి చెందిన శాసనసభ్యుడు ఉన్నాడు. సటేనా ఫ్లైట్ 8895గా గుర్తించారు అధికారులు. మృతుల్లో కొలంబియా ఛాంబర్ ఆఫ్ డిప్యూటీ సభ్యుడు డియోజెనెస్ క్వింటెరో, రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కార్లోస్ సాల్సెడో ఉన్నారు. వీరిద్దరు తమ టీమ్‌తో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

రాజకీయ నేతలతోపాటు పలువురు మృతి

ఆదేశ ప్రభుత్వ విమానయాన సంస్థ సటేనా విమానాన్ని లీజుకు తీసుకుంది. ఈ విమానం కుకుటా నుండి బయలుదేరింది. మధ్యాహ్నం సమయంలో ఒకానాలో ల్యాండ్ కావడానికి కొద్దిసేపటి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయింది. అయితే విమానం మిస్సయిన ప్రాంతంలో దానికి సంబంధించిన శిథిలాలు కనుగొనబడ్డాయి. దీంతో విమానంలోని నేతలు, ప్రయాణీకులు, సిబ్బంది మరణించారని అధికారులు ధృవీకరించారు.

ALSO READ: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమం.. స్పష్టత ఇవ్వాలని కుటుంబ సభ్యుల డిమాండ్

 

Related News

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

అమెరికాలో షాకింగ్ ఘటన.. నువ్వు ముస్లిమా అంటూ, భారతీయుడ్ని 15 సార్లు కత్తితో పొడిచి..

Big Stories

Advertisement
×