E-Paper
Advertisement

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 15 మంది దుర్మరణం, ఎన్నికల అభ్యర్థులతోపాటు రాజకీయ నేతలు

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 15 మంది దుర్మరణం, ఎన్నికల అభ్యర్థులతోపాటు రాజకీయ నేతలు
Advertisement

Plane Crash: ఈ మధ్యకాలంలో వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం మహారాష్ట్రలో విమాన ప్రమాదం జరిగి 24 గంటలు గడవకుందే మరొక విమానం కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 15 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన కొలంబియాలో చోటు చేసుకుంది.

కొలంబియాలో ఘోర విమానం ప్రమాదం

Advertisement

కొలంబియాలో ఘోర విమానం ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశంలో కుకుటా సిటీ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కంట్రోలింగ్ టవర్స్‌తో సిగ్నల్స్ తెగిపోయాయి. ఆ విమానంలో దాదాపు 13 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు విమానం సిబ్బంది ఉన్నారు. ఆదేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒకానా సిటీలో ల్యాండ్ కావాల్సివుంది. ఫ్లైట్ కూలిన ప్రాంతం వెనిజువెలాకు సరిహద్దున ఉంది.

ఆ ప్రాంతం పర్వతాలతో కూడి ఉండడం ఒకటైతే, వాతావరణం సరిగ్గా లేకపోవడం మరొక కారణం. ఆ విమానంలో ఆ దేశానికి చెందిన శాసనసభ్యుడు ఉన్నాడు. సటేనా ఫ్లైట్ 8895గా గుర్తించారు అధికారులు. మృతుల్లో కొలంబియా ఛాంబర్ ఆఫ్ డిప్యూటీ సభ్యుడు డియోజెనెస్ క్వింటెరో, రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కార్లోస్ సాల్సెడో ఉన్నారు. వీరిద్దరు తమ టీమ్‌తో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

రాజకీయ నేతలతోపాటు పలువురు మృతి

ఆదేశ ప్రభుత్వ విమానయాన సంస్థ సటేనా విమానాన్ని లీజుకు తీసుకుంది. ఈ విమానం కుకుటా నుండి బయలుదేరింది. మధ్యాహ్నం సమయంలో ఒకానాలో ల్యాండ్ కావడానికి కొద్దిసేపటి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయింది. అయితే విమానం మిస్సయిన ప్రాంతంలో దానికి సంబంధించిన శిథిలాలు కనుగొనబడ్డాయి. దీంతో విమానంలోని నేతలు, ప్రయాణీకులు, సిబ్బంది మరణించారని అధికారులు ధృవీకరించారు.

ALSO READ: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమం.. స్పష్టత ఇవ్వాలని కుటుంబ సభ్యుల డిమాండ్

 

Related News

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

Big Stories

Advertisement
×