Elephant Revange: సృష్టిలో కొన్ని జంతువులకు రివేంజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. తమను ఏమైనా చేస్తే ఆ ఫ్యామిలీని వెంటాడుతాయి. వాటిలో పాముతోపాటు రకరకాల జంతువులు ఉన్నాయి. ఆ జాబిాతాలోకి ఇప్పుడు ఏనుగు కూడా చేరిపోయింది. నేపాల్లో ఊహించని ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల తర్వాత ఓ కుటుంబాన్ని వెంటాడి మరీ చంపేసింది ఆ ఏనుగు. అసలు స్టోరీలోకి వెళ్తే..
నేపాల్లో దారుణమైన ఘటన-నేపాల్లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో శనిచర బోటే కుటుంబం ఉండేది. అయితే ఆ ఫ్యామిలీకి ‘ధుర్బే’ ఏనుగు రూపంలో యముడు వెంటాడుతూ వచ్చాడు. 2012 డిసెంబర్లో మాడి పట్టణంలో ‘ధుర్బే’ ఏనుగు దాడి చేసింది. దీంతో శనిచర పేరెంట్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన ఘటనతో షాక్కు గురైన శనిచర, తన కుటుంబాన్ని ఏనుగు నుంచి కాపాడుకోవాలని డిసైడ్ అయ్యాడు.
మోస్ట్ డేంజర్ ధుర్బే ఏనుగు-ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి మకాం మార్చేశాడు. రాప్తి నది దాటిన తర్వాత దాదాపు 9 మైళ్ల దూరంలో ఉన్న జగత్పూర్ ప్రాంతానికి తన నివాసాన్ని మార్చుకున్నాడు. ఆ ఏనుగు నుంచి ఎలాంటి ముప్పు ఉండదని భావించాడు. హాయిగా సాగుతోంది శనిచర ఫ్యామిలీ జీవితం. దాన్ని నుంచి తాము తప్పించుకున్నామని ఆ కుటుంబం హాయిగా ఉంటోంది.
14 ఏళ్ల తర్వాత ఓ ఫ్యామిలీని వెంటాడి మరీ చంపింది-మళ్లీ వారి జీవితాల్లో ధుర్భే ఏనుగు ఎంట్రీ ఇచ్చింది. జూలై మొదటి వారంలో శనిచర ఫ్యామిలీలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆ ఏనుగు.. వీరి జాడను పసిగట్టి వెతుక్కుంటూ వచ్చింది. ఈనెల మొదటి వారంలో జగత్పూర్లోని శనిచర ఇంటిపై దాడి చేసింది. శనిచర కోడలు ఆషికా, నాలుగేళ్ల మనవడు భరత్ అతి కిరాతకంగా చంపేసింది.
కన్నీరుమున్నీరౌైన బోటేలు-ఈ ఘటనతో బోటేలు గుండెలు పగిలేలా రోదించాడు. నదులు దాటి ఇంత దూరం వస్తే ఏమీ చేయలేదని నమ్మామని, ఇన్ని ఏళ్ల తర్వాత ఆ ఏనుగు వెతుక్కుంటూ వచ్చి కోడలు, మనవడ్ని చంపేసిందని కన్నీరు మున్నీరు అయ్యాడు. తాము పారిపోవడానికి చోటు లేదని నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడ్వడం మొదలుపెట్టాడు. తాజా దాడితో 14 ఏళ్ల వ్యవధిలో ఆ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఆ ఏనుగు చేతిలో మరణించారు.
వికీపీడియాలో ఈ ఏనుగుకు ఓ పేజీ –నేపాల్లో ‘ధుర్బే’ ఏనుగు అత్యంత ప్రమాదకరమైనదిగా చెబుతారు వివిధ ప్రాంతాల వాసులు. 2010 నుంచి ఇప్పటివరకు ఆ ఏనుగు రెండు డజన్ల మందిని చంపినట్లు చిత్వాన్ నేషనల్ పార్క్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఘటనకు ముందు 23 మందిని చంపినట్లు మా రికార్డుల్లో ఉందని చెబుతున్నారు. ఈ ఘటనతో ఆ సంఖ్య 25కు చేరింది. తాజా మరో విషయం ఏంటంటే.. ఈ ఏనుగు పేరు మీద వికీపీడియాలో ఒక పేజీ కూడా ఉంది.
ALSO READ: నేపాల్లో రగులుతున్న మరో జెన్-జీ ఉద్యమం.. ఏకంగా ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్.. ఎందుకంటే?
ధ్రుబే ఏనుగు కదలికలను పర్యవేక్షించడానికి 2016 నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు అటవీ అధికారులు. దానికి ట్రాకింగ్ కాలర్ అమర్చారు. 2020, 2023లో ఆ కాలర్ను మార్చినప్పటికీ పూర్తిగా నియంత్రించడంలో విఫలమయ్యారు అధికారులు. అడవులు తగ్గిపోవడం, మానవ నివాసాలు పెరగడం వల్ల నేపాల్లో ఇలాంటి ఘర్షణలు పెరుగుతున్నాయని అంటున్నారు.