OnePlus Pad Go 2: టెక్ ప్రియులకు వన్ప్లస్ షాకిచ్చింది. భారతదేశంలో తమ పాపులర్ ట్యాబ్లెట్లు అయిన ‘వన్ప్లస్ ప్యాడ్ గో 2, ‘వన్ప్లస్ ప్యాడ్ లైట్’ ధరలను కంపెనీ భారీగా పెంచింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన ఈ రెండు డివైజ్ల ధరలు ఇప్పుడు మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. పెరిగిన ఈ కొత్త ధరలు ఇప్పటికే వన్ప్లస్ ఇండియా అధికారిక వెబ్సైట్లో లైవ్లోకి వచ్చాయి.
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో RAM, స్టోరేజ్ విడిభాగాల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా AI టెక్నాలజీ డిమాండ్ పెరగడంతో.. విడిభాగాల తయారీ కంపెనీలు తమ ఫోకస్ను డేటా సెంటర్ల వైపు మళ్లించాయి. దీనివల్ల సాధారణ మొబైల్స్, ట్యాబ్లెట్లకు వాడే విడిభాగాల ధరలు పెరిగిపోయాయి. ఈ ప్రభావం వన్ప్లస్ ట్యాబ్లపై పడింది. గతంలో కొన్ని స్మార్ట్ఫోన్ల ధరలను కూడా వన్ప్లస్ ఇలాగే పెంచింది.
Also Read: చెవులకు నొప్పి ఉండదు.. 37 గంటల బ్యాటరీతో అదరగొడుతున్న సోనీ కొత్త ఇయర్బడ్స్!
తాజా మార్పుల ప్రకారం.. వన్ప్లస్ ప్యాడ్ గో 2 బేస్ వేరియంట్ (8GB+128GB, వై-ఫై) ధర రూ.29,999కి చేరింది. అలాగే 256GB మోడల్ ధర రూ.32,999 కాగా.. 5G కనెక్టివిటీ ఉన్న టాప్ వేరియంట్ రూ.35,999కి పెరిగింది. మరోవైపు వన్ప్లస్ ప్యాడ్ లైట్ (6GB+128GB, వై-ఫై) బేస్ మోడల్ ధర రూ.19,999కి పెరగ్గా.. 8GB ర్యామ్ కలిగిన సెల్యులార్ మోడల్ ధర రూ.22,999కి చేరుకుంది.
లాంచ్ ధరలతో పోల్చి చూస్తే.. ఈ పెంపు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వన్ప్లస్ ప్యాడ్ గో 2 ప్రారంభంలో రూ.26,999కి, వన్ప్లస్ ప్యాడ్ లైట్ రూ.15,999కి విడుదలయ్యాయి. అంటే లాంచ్ ధరతో పోలిస్తే ఈ రెండు ట్యాబ్లెట్లపై ఇప్పుడు ఏకంగా రూ.3,000 వరకు అదనపు భారం పడుతోంది. ఇటీవల జరిగిన వరుస ధరల పెంపుతో కస్టమర్లపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది.
ధరలు పెరిగినప్పటికీ.. వన్ప్లస్ ప్యాడ్ గో 2 అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. దీనిలో 12.1 ఇంచుల 2.8K ఎల్సీడీ డిస్ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300-ఆల్ట్రా ప్రాసెసర్తో పనిచేసే ఈ ట్యాబ్లో 10,050mAh భారీ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్, బ్యాక్ సైడ్ 8MP కెమెరాలను అందించారు.
Also Read: కష్టపడి రుద్దాల్సిన పనిలేదు.. ఈ 5 పదార్థాలతో వంటగది జిడ్డు చిటికెలో మాయం!