Iran Attacks US Bases: ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ గా దాడులు చేస్తున్నాయి. ఈ దాడులను తిప్పికొట్టేందుకు ఇరాన్.. మిడిల్ ఈస్ట్ దేశాల్లో అమెరికా ఎయిర్, నేవల్ బేస్ లను టార్గెట్ చేసింది. యూఏఈలోని అబుదాబి, దుబాయ్, ఖతార్లోని దోహా, సౌదీ అరేబియాలోని రియాద్లలో యూఎస్ బేస్ లపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. అబుదాబిలో భారీ పేలుళ్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బహ్రెయిన్ లోని యూఎస్ బేస్ పై ఇరాన్ దాడి చేసింది. దోహా, రియాద్లలో కూడా పేలుళ్లు వినిపించాయని స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. మిడిల్ ఈస్ట్ లోని చాలా దేశాలు అమెరికన్ సైన్యానికి ఆశ్రయం కల్పిస్తున్నాయి.
అబుదాబిలో యూఏఈ, యూఎస్ ఎయిర్ బేస్ జాయింట్ గా స్థావరాన్ని నిర్వహిస్తున్నాయి. దుబాయ్లోని జెబెల్ అలీ నౌకాశ్రయం మిడిల్ ఈస్ట్ లో యూఎస్ నేవీకి ఉన్న అతిపెద్ద నౌకాశ్రయం. దోహాలోని 24 హెక్టార్ల అల్ ఉదీద్ వైమానిక స్థావరం కూడా యూఎస్ సెంట్రల్ కమాండ్కు ఫార్వర్డ్ కార్యాలయంగా పనిచేస్తుంది. సౌదీ అరేబియాలో 2000 మందికి పైగా అమెరికా సైనికులు ఉన్నారు. వీరిలో కొందరు రియాద్కు దాదాపు 60 కి.మీ దూరంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో ఉన్నారు.
మనామాలో ఉన్న అమెరికా నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడి జరిగిందని బహ్రెయిన్ తెలిపింది. యూఎస్ నేవీ ఐదో నౌకాదళం ఉన్న ప్రాంతం గల్ఫ్, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అనేక యూఎస్ నౌకలు బహ్రెయిన్లో తమ సొంత ఓడరేవును కలిగి ఉన్నాయి. వాటిలో యాంటీ-మైన్ నౌకలు, లాజిస్టికల్ సపోర్ట్ షిప్లు ఉన్నాయి.
Also Read: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. విదేశీ ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ‘హై అలర్ట్’!
జోర్డాన్లో కూడా సైరన్లు మోగాయి. కువైట్ కూడా తన వైమానిక స్థావరాల్లో దాడులు జరిగాయని తెలిపింది. తమను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం,ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది. ఇరాన్ దురాక్రమణను తీవ్రంగా ఖండిస్తున్నామని సౌదీ అరేబీయా పేర్కొంది.
ఈ దాడులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్ ల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని ఆ దేశాలు ప్రకటన చేశాయి. ఇందుకు టెహ్రాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించాయి.