E-Paper
Advertisement

Food Safety: అరటి పండ్లను ఇలా వదిలేస్తున్నారా? బల్లి ఏం చేసిందో మీరే చూడండి!

Food Safety: అరటి పండ్లను ఇలా వదిలేస్తున్నారా? బల్లి ఏం చేసిందో మీరే చూడండి!
Advertisement

Food Safety: సాధారణంగా మనం మార్కెట్ నుండి తెచ్చిన అరటి పండ్లను టేబుల్ మీదో లేదా వంటగదిలోనో అలా వదిలేస్తుంటాం. కానీ అలా వదిలేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మీరు అస్సలు నమ్మలేరు.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో సరిగ్గా తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ బల్లి హాయిగా అరటిపండును నాకుతూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు అంతా షాక్ అవుతున్నారు. అయితే బల్లి నాకిన పండ్లు విషంగా మారుతాయా, లేదా? అనే ప్రశ్నకు నిపుణులు ఏం సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

బల్లి నాకితే విషపూరితమా?

Advertisement

మొదటి నుంచి మన పెద్దలు ఏం చెబుతున్నారంటే.. బల్లి పాలు లేదా అన్నం మీద పడితే అది విషపూరితం అవుతుందని. ఆ ఆహారాన్ని తింటే ప్రాణాలు పోతాయని నమ్ముతుంటాం. దీనికి గౌళీ శాస్త్రం వంటి నమ్మకాలు కూడా తోడయ్యాయి. అయితే, సైన్స్ ఏం చెబుతుందంటే.. నిజానికి మన ఇళ్లలో తిరిగే బల్లులు విషపూరితమైనవి కావు. వాటి లాలాజలంలో కానీ, చర్మంలో కానీ ప్రాణాలు తీసే విషం ఉండదు. కాబట్టి.. బల్లి ఏదైనా పండ్లను నాకినంత మాత్రాన అది వెంటనే విషంగా మారిపోదట.

Also Read: ఎండలు మండిపోతున్నాయని చెరకు రసం తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే డేంజరే!

అసలైన ముప్పు బ్యాక్టీరియాతోనే..

Advertisement

బల్లి విషపూరితం కాకపోయినప్పటికీ.. దాని వల్ల ఒక పెద్ద సమస్య ఉంది. బల్లులు గజ్జి, బొద్దింకలు వంటి పురుగులను తింటాయి. వాటి శరీరంలో, ముఖ్యంగా పొట్టలో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. బల్లి ఆహారాన్ని తాకినప్పుడు లేదా దాని విసర్జితాలు ఆహారంలో పడినప్పుడు ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరుతుంది. దీంతో వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పి వంటి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపిస్తాయి. ప్రాణాపాయం లేకపోయినా, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.

ముందు జాగ్రత్తలు తప్పనిసరి:

అరటి పండ్లు లేదా ఇతర ఆహార పదార్థాలను ఎప్పుడూ మూతలు ఉన్న డబ్బాల్లో లేదా నెట్ కవర్లతో కప్పి ఉంచడం మంచిది. ముఖ్యంగా పండ్లు తినే ముందు వాటిని శుభ్రంగా కడగాలి. బల్లులు రావడానికి ప్రధాన కారణం మన ఇంట్లో ఉండే పురుగులే. అందుకే కిచెన్‌ను శుభ్రంగా ఉంచుకుంటే బల్లుల బెడద తగ్గుతుంది. ఒక్కోసారి బల్లి ఆహారంలో పడి చనిపోయినప్పుడు బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తుంది. అలాంటప్పుడు ఆ ఆహారాన్ని తినకూడదని చెబుతున్నారు నిపుణులు.

Also Read: బ్రెయిన్ సర్జరీలో మాట పడిపోకుండా కొత్త టెక్నిక్.. ఇక భయం లేనట్టే!

?utm_source=ig_web_button_share_sheet

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×