E-Paper
Advertisement

Pakistan High Fuel Price: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం..ఆపై బాదుడు, లీటర్ పెట్రోల్ రూ. 300

Pakistan High Fuel Price: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం..ఆపై బాదుడు, లీటర్ పెట్రోల్ రూ. 300

Pakistan High Fuel Price: ఇరాన్ యుద్ధం ప్రభావం ఒక్కో దేశంపై క్రమంగా పడుతోంది. ఈ విషయంలో పాకిస్థాన్ ముందు వరుసలో ఉంది. ఆ దేశంలో చమురు సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఫలితంగా ప్రజలపై వడ్డన మొదలైంది. ఇంధనంపై సుంకాన్ని లీటరుకు రూ. 100 నుండి మూడు రెట్లు పెంచింది. ఫలితంగా అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి.

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం

కొన్నాళ్లుగా పాకిస్తాన్‌ ఆర్థిక పరిస్థితి పడుతూ లేస్తూ ఉంటుంది. దీనికితోడు ఇరాన్ యుద్ధం, ఆపై చమురుపై ఆంక్షలు నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి వద్ద నౌకలు ఎక్కడి కక్కడ ఆగిపోయాయి. ఫలితంగా పలు దేశాల్లో చమురు సంక్షోభం మొదలైంది. వివిధ దేశాలు ఆయిల్‌పై ధరలు అమాంతంగా పెంచుతున్నాయి.. పెంచేస్తున్నాయి కూడా.

తాజాగా పాకిస్థాన్ ఇంధనంపై సుంకాన్ని మూడు రెట్లకు పెంచేసింది. యుద్ధానికి ముందు అక్కడ లీటర్ పెట్రోల్, డీజిల్ సుమారు 100 రూపాయలు పైగానే ఉండేది. తాజాగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ విధించిన పన్నుతో లీటర్ పెట్రోల్ ధర రూ.321 లకు చేరింది. డీజిల్ ధర రూ. 335 లకు చేరింది. ఇక 11 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం ధర రూ.2664 పలుకుతోంది.

సంపన్నులు వినియోగించే ఆయిల్‌పై మూడు రెట్లు సుంకం విధింపు

విలాసవంతమైన వాహనాల్లో వాడే అధిక ఆక్టేన్ ఇంధనాన్ని లక్ష్యంగా చేసుకుంది. దీనిద్వారా పెరుగుతున్న ఇంధన ధరలను భర్తీ చేయడానికి ఆ ఆదాయాన్ని ఉపయోగించాలని భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి నెలకు 9 బిలియన్ల రూపాయలు ఆదా అవుతుందని షరీఫ్ ప్రభుత్వం చెబుతున్నమాట. ఈ భారాన్ని దేశంలోని అత్యంత సంపన్న వర్గంపై భారం వేసింది.

ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సమావేశంలో ఇంధన ధరలు, ఆర్థిక ఉపశమన చర్యలను సమీక్షించింది. ఈ పెంపు తర్వాత పెట్రోల్ ధరలు లీటరుకు PKR 266.17 నుండి 321.17కు పెరిగింది. అలాగే డీజిల్ ధరలు లీటరుకు PKR 280.86 నుండి PKR 335.86కు పెరిగాయి.

ALSO READ: ఇరాన్ కొత్త స్కెచ్.. ఒక్కో నౌకలపై 18 కోట్లు ట్యాక్స్, ఆయిల్ ధరలు పెరగడం ఖాయం? 

విమానయాన రంగంలో దీని ప్రభావం కనిపించింది. మార్చి 10 కి పెరిగిన జెట్ ఇంధన ధరలకు అనుగుణంగా పాకిస్తాన్ విమానయాన సంస్థలు ఛార్జీలను పెంచాయి. కరాచీ-లాహోర్, కరాచీ-ఇస్లామాబాద్ వంటి కీలక మార్గాలలో దేశీయ టిక్కెట్ల ధరలు PKR 2,800 నుండి PKR 5,000 వరకు పెరిగిన విషయం తెల్సిందే.

 

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×