E-Paper
Advertisement

Iran Warning Trump: ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్.. మూల్యం తప్పదని ఘాటు హెచ్చరిక

Iran Warning Trump: ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్..  మూల్యం తప్పదని ఘాటు హెచ్చరిక
Advertisement

Iran Warning Trump: ఇరాన్-అమెరికా వార్ నేపథ్యంలో ప్రతీరోజు మీడియా ముందుకొస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక ఇరాన్ పనైపోయిందని ఒకసారి, వారి సైన్యం తోక ముడిచిందని మరోసారి ఇలా రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చింది ఇరాన్. ట్రంప్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

Advertisement

ఇరాన్-అమెరికాల మధ్య యుద్ధం మొదలై వారం గడిచిపోయింది. రెండోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆయా దేశాలు యుద్ధం వ్యూహాన్ని మార్చాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని మరోసారి కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు. ఇరాన్‌ సుప్రీం ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

ఖమేనీకి అత్యంత సన్నిహితుల్లో అలీ లారిజానీ కూడా ఒకరు. తమ నాయకుడి మృతికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. ట్రంప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని తేల్చి చెప్పేశారాయన. అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో అగ్రనాయకుడితోపాటు అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రస్తావించారు.

Advertisement

తగిన మూల్యం తప్పదని అలీ లారిజాని ఘాటు హెచ్చరిక

ఇది సాధారణ విషయం కాదని, తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని రాసుకొచ్చారు. ఈ ప్రాంతంలో అమెరికా-ఇజ్రాయెల్‌ స్థావరాలపై మా దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. వారికి తాము తీవ్ర నష్టాలను కలిగించామని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో వెనిజులాలో అమెరికా సైన్యం ప్రమేయాన్ని ప్రస్తావించారు. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడానికి దారి తీసిందన్నారు.

వెనిజులా మాదిరిగా తక్కువ సమయంలో యుద్ధాన్ని ముగించాలని అమెరికా భావించినప్పటికీ అది విఫలమైందన్నారు. యుద్ధం నేపథ్యంలో అనేకమంది అమెరికా సైనికులను బంధించామని మరో పోస్టులో రాసుకొచ్చారు. వారిని జైళ్లలో ఉంచామన్నారు. ఇరాన్‌ దాడుల్లో ఆరుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారంటూ ట్రంప్‌ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.

ALSO READ: నార్వే రాజధాని ఓస్లో.. యూఎస్ ఎంబసీ వద్ద పేలుడు

ఆ దేశ ప్రభుత్వ అబద్ధాలు, మోసాలకు మరో నిదర్శనమన్నారు. నిజానికి అమెరికా సైనికులు దాదాపు 500 కంటే ఎక్కువ మంది చనిపోయారని అన్నారు. చాలా మంది అమెరికా సైనికులను ఖైదీలుగా తీసుకున్నట్లు తెలిపారు. కానీ అమెరికా మాత్రం చంపామని చెబుతున్నారని వివరించారు. సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరని అన్నారు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనలను లారిజానీ కౌంటర్ ఇవ్వడం ఇది రెండోసారి.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×