E-Paper
Advertisement

Oslo: నార్వే రాజధాని ఓస్లో.. యూఎస్ ఎంబసీ వద్ద పేలుడు, దర్యాప్తులో భద్రతా సంస్థలు

Oslo: నార్వే రాజధాని ఓస్లో.. యూఎస్ ఎంబసీ వద్ద పేలుడు, దర్యాప్తులో భద్రతా సంస్థలు
Advertisement

Oslo: ఆదివారం తెల్లవారు జామున నార్వే రాజధాని ఓస్లోలో అమెరికా రాయబార కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్వల్పంగా నష్టం వాటిల్లింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేదని నార్వే పోలీసులు చెప్పారు. బాధ్యుల కోసం గాలింపు మొదలుపెట్టాయి భద్రతా బలగాలు. అసలు ఎలా జరిగింది?

నార్వే రాజధాని ఓస్లోలో యూఎస్ ఎంబసీ వద్ద పేలుడు

Advertisement

నార్వే రాజధాని ఓస్లోలో ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో భారీ పేలుడు సంభవించింది. అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఎంబసీ సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఆఫీసు నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో నార్వే ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

పేలుడు గురించి సమాచారం అందుకున్న వెంటనే భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పేలుడులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని నార్వే పోలీసులు తెలిపారు. ఎంబసీ కార్యాలయం బయట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా ఎంబసీ కార్యాలయం చుట్టూ భారీగా బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం.

Advertisement

అలర్టయిన నార్వే ప్రభుత్వం.. దర్యాప్తులోకి దిగిన భద్రతా సంస్థలు

యూరప్‌లోని అత్యంత స్థిరమైన రాజధానుల్లో ఓస్లో కూడా ఒకటి. ఈ పేలుడు రాయబార కార్యాలయం కాన్సులర్ విభాగం ప్రవేశద్వారం వద్ద జరిగింది. దాని మూలల గురించి వివరించడానికి సంబంధిత అధికారులు నిరాకరించారు. దర్యాప్తు సంస్థలు దీన్ని ప్రమాదకరంగా పరిగణించడం లేదని సూచించాయి.

పోలీసులకు కారణం గురించి ఒక ఆలోచన ఉందని దర్యాప్తు అధికారి అన్నారు. ఎవరో చేసిన చర్య అని మాకు అనిపిస్తోందని, దర్యాప్తు అధికారులు సాక్షులతో మాట్లాడినట్టు ఓ అధికారి పేర్కొన్నారు. ఘటనా స్థలానికి వచ్చిన బాంబు స్క్వాడ్ సమీపంలోని ప్రాంతాన్ని పరిశీలించింది. ఎలాంటి పేలుడు పరికరాలు లేవని పేర్కొంది.

ALSO READ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బాంబుల మోత.. దగ్గమైన చమురు డిపోలు

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×