E-Paper
Advertisement

America: విషాదం.. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం

America: విషాదం.. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
Advertisement

America: తీవ్ర విషాదం.. సంపాదన కోసం వెళ్లి అనంత లోకాలకు వెళ్లాడు.. ప్రస్తుత కాలంలో చదువు పూర్తవడమే ఆలస్యం.. అందరిని వదిలేసి డబ్బు కోసం విదేశాలకు వలస వెళుతున్నారు. అక్కడే సెటిల్ అవుతున్నారు. అలాగే రాకేశ్ కూడా వెళ్లాడు.. అయితే వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) అమెరికాలో గుండెపోటుతో కన్నుమూశారు. వరంగల్ నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త జితేంద్ర కుమారుడైన రాకేశ్, ఉన్నత చదువుల అనంతరం గత పదేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు.

భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఆయన అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారని, ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచారని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. నిన్నటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న రాకేశ్, ఇలా ఆకస్మికంగా మరణించడంతో వరంగల్‌లోని ఆయన నివాసంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

అయితే రాకేశ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో ఆయనకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో నివాసముంటోంది. విదేశాల్లో స్థిరపడి, కెరీర్‌లో రాణిస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్రంగా కలచివేస్తోంది. రాకేశ్ మరణవార్త విన్న స్థానిక ప్రవాస భారతీయులు వారి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.

ప్రస్తుతం రాకేశ్ భౌతిక కాయాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలోని తెలుగు సంఘాలు, స్థానిక అధికారుల సమన్వయంతో త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుమారుడి అకాల మరణంతో తండ్రి జితేంద్ర, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక ప్రతిభావంతుడైన యువ ఇంజినీర్‌ను కోల్పోవడం పట్ల వరంగల్ ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: ఇరాన్ యుద్ధం.. బుక్కైన 19 మంది భారతీయులు, ఆపై అరెస్టులు, శిక్షలు కఠినంగానే

ఈ క్లిష్ట సమయంలో బాధితులకు ప్రభుత్వ సహాయం, ప్రవాస సంఘాల సహకారం ఎంతో అవసరమని ఆయన స్నేహితులు కోరుతున్నారు. రాకేశ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా వరంగల్ తరలించేందుకు కావాల్సిన వీసా, ఇతర ఫార్మాలిటీలను పూర్తి చేయడంలో అక్కడి అధికారులు నిమగ్నమయ్యారు.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×