E-Paper
Advertisement

Pakistan: పాకిస్తాన్ లో ముంబై తరహా ఉగ్రదాడి.. చేసిన పాపం అనుభవించాల్సిందేనా!?

Pakistan: పాకిస్తాన్ లో ముంబై తరహా ఉగ్రదాడి.. చేసిన పాపం అనుభవించాల్సిందేనా!?
Advertisement

Pakistan: చేసిన పాపం ఊరికే పోదంటారు. ఉగ్రవాదులకు పాలు పోసి పెంచారు. ట్రైనింగ్ ఇచ్చి, ఆయుధాలు సమకూర్చి.. ముంబైపై దాడికి ఉసిగొల్పారు. ముష్కర మూక ముంబై మహానగరంలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి.. వందలాది మందిని పొట్టనపెట్టుకుంది. కసబ్ ను దొరకబట్టి.. ఉరి తీసి కసి తీర్చుకుంది ఇండియా.

ముంబైలో మారణహోమం జరిపించించి పాకిస్తానే అని అందరికీ తెలుసు. అందుకు సాక్షాలు కూడా ఉన్నాయి. అయినా, తమకేం సంబంధం లేదని బుకాయిస్తుంటుంది పాపిస్తాన్. అయితే, ఏ ఉగ్రవాదులకైతే పాక్ పాలు పోసి పెంచిందో.. ఇప్పుడు అదే టెర్రరిస్టుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వరుస బాంబు పేలుళ్లతో వందలాది మంది చనిపోతున్నారు. లేటెస్ట్ గా, కరాచీలో ముంబై తరహా దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు.

Advertisement

10 మంది ఉగ్రవాదులు కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జొరబడ్డారు. ధనాధన్ కాల్పులు జరిపారు. పోలీసులు కోలుకునేలోగా తూటాలు దిగిపోయాయి. టెర్రర్ అటాక్ లో 12 మంది కరాచీ పోలీసులు చనిపోయారని తెలుస్తోంది. హెడ్ క్వార్టర్స్ లోపల ఫైరింగ్ ఇంకా కొనసాగుతోందని సమాచారం.

కరాచీ పోలీస్ చీఫ్ ను ఉగ్రవాదులు బంధీగా పట్టుకున్నారని అంటున్నారు. విషయం తెలిసి.. అదనపు బలగాలను తరలించారు. టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరా కాల్పులు జరుగుతున్నాయి.

Advertisement

సేమ్ టు సేమ్ ముంబై అటాక్ మాదిరే జరిగిందీ ఘటన. ఇండియాకు ఆర్థిక రాజధాని అయిన ముంబైలో జరిగినట్టుగానే.. పాకిస్తాన్ ఫైనాన్సియల్ కేపిటల్ కరాచీలో టెర్రర్ అటాక్ జరగడం యాదృచ్ఛికం.

Related News

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

అమెరికాలో షాకింగ్ ఘటన.. నువ్వు ముస్లిమా అంటూ, భారతీయుడ్ని 15 సార్లు కత్తితో పొడిచి..

Big Stories

Advertisement
×