E-Paper
Advertisement

UK Visa Fee Hike: బ్రిటన్ బాదుడు, వీసా ఫీజు 25 శాతం పెంపు.. ఎవరిపై ఎంత భారం?

UK Visa Fee Hike:  బ్రిటన్ బాదుడు, వీసా ఫీజు 25 శాతం పెంపు.. ఎవరిపై ఎంత భారం?

UK Visa Fee Hike: యూనైటెడ్ కింగ్‌డమ్ పర్యాటక, విద్యార్థి సహా అన్ని రకాల వీసా ఫీజులను 6 నుంచి 25 శాతం వరకు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 8, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. యూకే హోమ్ ఆఫీస్ ప్రకటనతో.. బ్రిటన్ వెళ్లే వారిపై మరింత భారం పడనుంది. ఇమ్మిగ్రేషన్, నేషనాలిటీ రుసుములు 6 నుంచి 7 శాతం మేర పెంచింది. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ రుసుము అత్యధికంగా 25 శాతం పెంచింది. ఇది 16 పౌండ్ల నుండి 20 పౌండ్ల మేర పెరగనుంది. పాస్‌పోర్ట్ ఛార్జీలను 8 శాతం మేర పెంచారు.

ఏ ఫీజులు పెరిగాయంటే?

ఆరు నెలల విజిటింగ్ వీసా రుసుము 127 పౌండ్ల నుండి 135 పౌండ్లకు, అంటే సుమారు రూ. 17,000కు పెరగనుంది. స్టూడెంట్ వీసా ఫీజులను 524 పౌండ్ల నుంచి 558 పౌండ్ల (రూ.16824)కు పెంచింది. వర్క్ వీసా ఛార్జీలను కూడా అన్ని కేటగిరీలలో సమరించింది. విదేశీయులకు మూడు సంవత్సరాల వరకు ఉండే స్కిల్డ్ వర్కర్ వీసా ఛార్జీ 769 పౌండ్ల నుండి 819 పౌండ్లకు( రూ.1,02,470) పెంచింది. అయితే మూడేళ్లకు పైగా ఉండే దరఖాస్తులకు 1,519 పౌండ్ల నుండి 1,618 పౌండ్లకు( రూ.2,02,437) పెరగనుంది. ఇప్పటికే యూకేలో ఉన్న వారికి మూడేళ్ల వరకు ఫీజు 885 పౌండ్ల నుండి 943 పౌండ్లకు, మూడేళ్ల పైగా ఉంటే వీసా రుసుము 1,751 పౌండ్ల నుంచి 1,865 పౌండ్లకు పెరుగుతుంది. ఆరోగ్య, సంరక్షణ వీసా ఫీజులను కూడా పెంచింది. మూడేళ్ల కాలానికి రుసుములు 304 పౌండ్ల నుంచి 324 పౌండ్లకు పెరగగా, మూడేళ్లకు పైబడిన దరఖాస్తులకు 590 నుండి 628 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది.

పౌరసత్వం మరింత ఖర్చు

తాత్కాలికంగా పని చేసేందుకు వెళ్లే వారిపైనా వీసా ఛార్జీ భారం పడనుంది. ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ వీసాతో సహా ఈ వీసాల ఛార్జీలను 319 పౌండ్ల నుంచి 340 పౌండ్లకు పెంచింది. స్థిరనివాసం, పౌరసత్వం కోసం అప్లై చేసుకున్న వారి వీసాలు కూడా ఖరీదుకానున్నాయి. నిరవధికంగా నివసించడానికి 3,029 నుండి 3,226 పౌండ్ల రుసుము చెల్లించాలి. బ్రిటిష్ పౌరసత్వం పొందడానికి ఖర్చు 1,605 పౌండ్ల నుంచి 1,709 పౌండ్లకు పెరిగింది. పిల్లల పౌరసత్వ నమోదుకు మినహాయింపు ఇచ్చారు. ఆ రుసుమును 1,214 పౌండ్ల నుంచి 1,000కు తగ్గించారు.

స్పాన్సర్లపై భారం

టూరిస్టులు, విద్యార్థులు, శాశ్వత నివాసం, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అనేక వర్గాల ప్రజలు ముందుగా చెల్లించాల్సిన ఖర్చులు భారీగా పెరగనున్నాయి. వీసా ఫీజులు పెంచడంతో స్పాన్సర్‌లకు కూడా ఖర్చులు పెరగనున్నాయి. స్పాన్సర్‌షిప్ ఫీజులో ఎలాంటి మార్పు చేయనప్పటికీ, విదేశీ కార్మికులను నియమించుకునే కంపెనీలు, స్పాన్సర్‌షిప్‌ను నిర్వహించే సంస్థలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చే లైసెన్స్ ఫీజులను భరించాల్సి ఉంటుంది.
(ఒక పౌండ్=125.32 రుపాయలు)

Also Read:  H–1B వీసాలపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం

Related News

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా దాడులు.. క్షిపణి ప్రయోగ కేంద్రాలు

Big Stories

×