US Navy MQ-4C Triton Drone Missing: అమెరికా రక్షణ రంగంలో తీవ్ర ఆందోళనకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. అమెరికా నౌకాదళానికి చెందిన అత్యాధునిక నిఘా డ్రోన్ MQ-4C Triton హార్ముజ్ జలసంధి పైగా ప్రయాణిస్తుండగా అనూహ్యంగా అదృశ్యమైంది. రూ. 1,853 కోట్ల రూపాయల విలువైన ఈ డ్రోన్ గల్లంతు కావడం వెనుక సాంకేతిక లోపమా, లేక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సంబంధమున్న ఏదైనా కుట్రమా అన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డ్రోన్ అదృశ్యం కావడం వెనుక సాంకేతిక లోపం ఉందా లేక ప్రత్యర్థి దేశాల కుట్ర ఉందా అనే కోణంలో అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
శుక్రవారం (ఏప్రిల్ 10) ఈ డ్రోన్ మూడు గంటల పాటు నిఘా కార్యకలాపాలను ముగించుకుని ఇటలీలోని తన బేస్ క్యాంపునకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. గాలిలో ఉన్న సమయంలోనే ఇన్-ఫ్లైట్ ఎమర్జెన్సీ అలర్ట్ ను జారీ చేసిన కొద్దిసేపటికే రాడార్ల నుండి దీని ఆచూకీ కనుమరుగైంది. అదృశ్యానికి ముందు ఈ డ్రోన్ అత్యంత వేగంగా తన ఎత్తును కోల్పోవడాన్ని ట్రాకింగ్ సిస్టమ్స్ గుర్తించాయి.
MQ-4C ట్రైటాన్ అనేది కేవలం ఒక డ్రోన్ మాత్రమే కాదు.. ఇది ఒక అత్యాధునిక నిఘా వ్యవస్థ. సముద్ర గర్భంలో, ఉపరితలంపై శత్రువుల కదలికలను గుర్తించడంలో దీనికి సాటిలేదు. 200 మిలియన్ డాలర్ల వ్యయంతో తయారైన ఈ డ్రోన్ గల్లంతు కావడం అమెరికా నౌకాదళానికి భారీ ఆర్థిక, వ్యూహాత్మక నష్టంగా భావిస్తున్నారు. హార్ముజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మరియు ఉద్రిక్తతలు కలిగిన ప్రాంతం కావడంతో, ఈ డ్రోన్ అదృశ్యంపై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
గతంలో కూడా ఇదే ప్రాంతంలో అమెరికా డ్రోన్లను ఇరాన్ కూల్చివేసిన చరిత్ర ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిందా లేక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా ఎవరైనా దీనిని దెబ్బతీశారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఇది ప్రత్యర్థి దేశాల చేతికి చిక్కితే అమెరికా రక్షణ రహస్యాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తన సాంకేతికను శత్రువుల కంట పడకుండా అమెరికా ఎంతకైన తెగిస్తుంది. ప్రస్తుతం అమెరికా తన సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్లను రంగంలోకి దించి డ్రోన్ శకలాల కోసం తీవ్రంగా గాలిస్తోంది.
Read Also: ప్రధాని మోదీ హత్యకు కుట్ర? CIAతో డీల్? బీహార్లో ముగ్గురు అనుమానితుల అరెస్ట్