Big Stories

Manage Recruitment 2024: పరీక్ష లేకుండానే జాబ్స్.. వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Manage Recruitment 2024: పరీక్ష లేకుండానే జాబ్ కావాలనుకునే నిరుద్యోగులకు శుభవార్త. కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు, పరీక్ష లేకుండానే జాబ్స్ ఇచ్చేందుకు వ్యవసాయ శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్సటెన్షన్ మేనేజ్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు హైదరాబాద్ నుండి కూడా దరఖాస్తులు స్వీకరిస్తుంది. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

- Advertisement -

అర్హత..

- Advertisement -

ఈ నోటిఫికేషన్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే సంఖ్య మాత్రం తెలపలేదు. అయితే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఈ ఉద్యోగానికి అర్హులని స్పష్టం చేసింది.

వయస్సు..

అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 35 సంవత్సరాలకు మించి ఉండకూడదని తెలిపింది. ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఎంపిక విధానం..

ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. అర్హత కలిగిన విద్యార్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. మే 6వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి 36వేల వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

లొకేషన్..

MANAGE, Rajendranagar, Hyderabad

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News