Big Stories

SIDBI : SIDBIలో 100 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు..

SIDBI : లఖ్‌నవూలోని స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా -SIDBI.. 100 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణులు అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 925 నిర్ధారించారు.

- Advertisement -

ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవడానికి 2023 జనవరి 03 తేదీ వరకు గడువు ఉంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2023 జనవరి లేదా ఫిబ్రవరిలో ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, గుంటూరు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

- Advertisement -

మొత్తం ఖాళీలు : 100 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఖాళీలు

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ పీజీ డిగ్రీ (కామర్స్‌/ ఎకనామిక్స్‌/ మేనేజ్‌మెంట్‌)/ సీఏ/సీఎస్‌/ సీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ/ సీఎంఏ/ పీహెచ్‌డీ

వయసు: 21-28 ఏళ్లు

ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ఫీజు: రూ.925

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03.01.2023

ఆన్‌లైన్‌ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2023

ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 2023

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమహేంద్రవరం, గుంటూరు, హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌

వెబ్‌సైట్‌: https://www.sidbi.in/en/careers/page/104

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News