E-Paper
Advertisement

Science Diplomacy:దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతున్న సైన్స్..

Science Diplomacy:దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతున్న సైన్స్..

Science Diplomacy:గత కొన్ని దశాబ్దాలుగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్నో ఊహించని మార్పులు వచ్చాయి. విదేశీ వ్యవహారాలు, నిర్ణయాలు తీసుకునే విషయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ధృడత్వాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని, శాస్త్రవేత్తలు, పరిశోధకులు అందరూ కలిసి పనిచేయాలన్న విషయం అర్థమైంది. ఈ విధంగా సైన్స్ విభాగంలో దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి.

గత కొన్నేళ్లలో సైన్స్ విభాగంలో డిప్లొమసీ పెరిగింది. ఒకదాని తర్వాత ఒకటి దేశాలు పలు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు శాస్త్రవేత్తలు దేశంతో సంబంధం లేకుండా వారికి సాయంగా నిలబడ్డారు. దీని ద్వారా సైన్స్ విషయంలో దేశాల మధ్య దూరం కూడా తగ్గిపోయింది. సైన్స్ డిప్లొమసి ముఖ్యంగా రెండు విషయాలను సూచిస్తుంది. అవే సమస్యలు వచ్చినప్పుడు ప్రపంచ దేశాల మధ్య నెట్‌వర్క్‌ను పెంపొందించడం, ఫారిన్ పాలిసీని బలంగా మార్చుకోవడం.

సైన్స్ డిప్లొమసి ఈ రెండు విషయాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. కానీ సైన్స్ ద్వారా ముందుగా దేశ అభివృద్ధిని సాధించాలా లేదా ప్రజలకు సాయంగా నిలబడాలా అన్న విషయంపై ప్రభుత్వాలు ఇంకా సతమతమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సైన్స్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లడంతో పాటు ప్రజలకు సైన్స్ అండగా కూడా నిలబడేలా చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. కానీ మరోవైపు సైన్స్ విషయంలో అండగా నిలబడుతున్న దేశాల మధ్య పోటీ కూడా ఏర్పడుతోంది.

కేవలం స్వదేశంలోనే కాదు విదేశాలలో కూడా మనుషులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ముందుగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు పాలిసీ మేకర్స్ దృష్టికి వెళ్లాలి. అవి పాలిసీకి లోబడి ఉన్నాయా లేదా అన్న పరీక్షలు జరిపిన తర్వాతే మార్కెట్‌లోకి వెళ్తాయి. ఇప్పటివరకు సైన్స్ డిప్లొమసి అన్నది పాలిసీ మేకింగ్‌లో ఒకటిగా చేరలేదు. కేవలం దేశాల మధ్య సహకారం అందించడం కోసం ఇది పనిచేస్తోంది.

సైన్స్ డిప్లోమసి ద్వారా ప్రపంచ దేశాల సమస్యల సులువుగా పరిష్కారమవుతున్న కూడా సైన్స్ విభాగంలో దేశాల మధ్య పోటీ మాత్రం అలాగే ఉండిపోతుంది. సైన్స్ విషయంలో ఎవరికి వారు తామే నెంబర్ 1 ప్లేస్‌లో ఉండాలనే దిశగా దేశ శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. ఈ ఒక్క విషయాన్ని సైన్స్ డిప్లోమసి ఏ మాత్రం మార్చలేకపోతోంది. మానవాళి మంచి కోసం సైన్స్ పనిచేసినా.. పరిశోధనల పరంగా ఎవరు ముందు విజయం సాధిస్తారు అన్నదే శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×