E-Paper
Advertisement

Secunderabad History: సికింద్రాబాద్ అసలు పేరేంటో తెలుసా..? ఇంకా ఆ ప్రాంతాల పేర్ల వెనకున్న సీక్రెట్ తెలుసా..?

Secunderabad History: సికింద్రాబాద్ అసలు పేరేంటో తెలుసా..? ఇంకా ఆ ప్రాంతాల పేర్ల వెనకున్న సీక్రెట్ తెలుసా..?

Secunderabad History: సికింద్రాబాద్‌ అసలు పేరేంటో తెలుసా..? అసలు హైదరాబాద్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? ఇంకా చెప్పాలంటే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోని కొన్ని ప్రాంతాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్: కులీకుతుబ్ షా భార్య  భాగమతి  వివాహం  తర్వాత తన  పేరుని  హైదర్ మహల్ గా మార్చుకున్నారు. హైదర్ మహల్  కాలక్రమేణా హైదరాబాద్‌ అయిందని చెప్తుంటారు.

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌ అనే పేరు వెనకాల కూడా ఒక హిస్టరీ ఉంది. మూడో  నిజాం  సికిందర్ ఝా  పేరు మీద ఈ ప్రాంతానికి సికింద్రాబాద్  అనే  పేరు  వచ్చింది . అంతకు ముందు  సికింద్రాబాద్ ని  లష్కర్  అని  పిలిచే వారు.

బేగం బజారు:  హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగంబజారుగా మారిపోయింది.

అఫ్జల్ గంజ్: ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది

చిక్కడపల్లి: చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్‌ పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో  బురద ఉండేదట. అలా బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడపల్లిగా మారిపోయింది.

అంబర్‌ పేట: అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది అంబర్‌ పేటగా స్థిరపడిపోయింది.

బేగంపేట: 6వ నిజాం  మహబూబ్  అలీ కుమార్తె బ‌షీర్ ఉన్నిసా బేగం ను ఉమ్రన్ అమిర్ కు ఇచ్చి పెళ్లి చేశాడు.. కూతురికి క‌ట్నం కింద‌ ఒక స్థలాన్ని  ఇచ్చాడు. ఆ స్థలానికి  బషీర్ ఉన్నిసా బేగం  పేరు  మీదగా  బేగంపేట  అని  పేరు వచ్చింది.

చార్మినార్: కులికుతుబ్ షా  కట్టిన  ఈ కట్టడానికి  ప్రధాన  ఆకర్షణ నాలుగు స్థంబాలు. ఉర్దూలో చార్ అంటే నాలుగు, మినార్ అంటే స్థంబాలు… వీటి పేరు మీదుగానే చార్ మినార్ అనే పేరు వ‌చ్చింది.

ఖైరతాబాద్:  ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది

శంషాబాద్: షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు మీద శంషాబాద్ అనే పేరు వ‌చ్చింది. ష‌మ్స్ అంటే సూర్యుడు. దీని అర్థం ప్రభువుల యందు సూర్యుడిలాంటి వాడని. ఈ బిరుదు నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్ కు ఉండేదట.

నాంపల్లి: నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్ అనే దివాన్‌కు నెఖ్‌ నామ్‌ ఖాన్  అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది.

హిమయత్ నగర్: 1933 లో  ఏడవ నిజాం  ఉస్మాన్  అలీఖాన్  యొక్క పెద్ద కుమారుడు హిమాయత్  అలీ ఖాన్  ఆస‌ఫ్ జా పేరు  మీద  ఆ స్థలానికి  హిమాయత్ నగర్  అని  పేరు వచ్చింది.

అబిడ్స్: ఆరో నిజాం కాలంలో అల్‌బర్ట్ అబిద్ అనే ఒక ఆర్మేనియా  యూదు వ్యాపారి  ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. తర్వాత  కొంతకాలానికి  ఆల్బర్డ్ అబిడ్  ఇంగ్లాండ్ కి వెళ్లిపోయిన‌ప్ప‌టికీ ఆ స్థలానికి ఆ పేరే స్థిర‌ప‌డిపోయింది!కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా అబిడ్స్ గా మారిపోయింది.

సోమాజిగూడ: నిజాం కాలంలోని రెవెన్యూ  డిపార్ట్మెంట్  అధికారైన సోనాజీకి  కొన్ని  భూములుండేవి. సోనాజీ కాస్త సోమాజి  అయింది.  గూడ  అంటే  చిన్న  గూడెం  లేదా ప్రాంతం  అని  అర్ధం. రెండు క‌లిపి సోమాజిగూడ అయ్యింది!

మలక్ పేట్: గోల్కొండ  రాజు అబ్దుల్  కుతుబ్ షా  యొక్క  సేవకుడు మాలిక్ యాకుబ్  పేరు  మీదగా  ఈ ప్రదేశానికి  మలక్ పేట్  అనే  పేరు  వచ్చింది

బషీర్ బాగ్: బసిరుద్దౌలాకు   హైద్రాబాద్ లో   ఒక ప్యాలెస్  ఉండేది. ఆ ప్యాలెస్  దగ్గర  పెద్ద గార్డెన్  ఉండేది . బసిరుద్దౌలా  పేరు  మీద  ఆ ప్రదేశానికి  బషీర్ బాగ్  అనే  పేరు  వచ్చింది.  బాగ్ అంటే  గార్డెన్  అని  అర్ధం.

ఫలక్ నుమా: ఫలక్  అంటే  ఆకాశం ,  నామ  అంటే  అద్దం .  ఈ ప్రదేశం  అంతా  కొండలతో  ఎంతో  ఎత్తుగా  ఉండేది . కాబట్టి  ఆకాశానికి  అద్దం  అనే అర్థం  వచ్చేలా  ఫలక్ నామ అని  పేరు  పెట్టారు . ఫలక్ నామ కాస్త ఫలక్ నుమా అయ్యింది!

సరూర్ నగర్: రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధానిగా పని చేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.

లంగర్ హౌజ్: గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ ఖానా కాలక్రమేణా లంగర్‌ హౌజ్‌ మారింది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.

చెంచల్‌ గూడ: చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్‌ గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.

దోమలగూడ:  దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారి పేరు మీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది.

తార్నాక: తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె. నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది.

శాలిబండ: శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ నివసించేవాడు.  ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు.. కాలక్రమంలో అది శాలిబండగా మారింది

మదీనా: ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనం వల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది.

ముషీరాబాద్: హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్ గా స్థిరపడిపోయింది.

చాదర్ ఘాట్: మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరొచ్చింది.

సుల్తాన్ బజార్: 1933 కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడే చౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక,  ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు.

చాంద్రాయణగుట్ట: చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణగుట్టగా మారిపోయింది.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమల శ్రీవారికి అలంకరించే శిఖామణి గురించి తెలుసా..? ఇంకా ఏమేం అలంకరిస్తారంటే

 

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×