E-Paper
Advertisement

Maharashtra: భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవదహనం

Maharashtra: భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవదహనం

Maharashtra: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హ్యాండ్ గ్లవ్స్ కర్మాగారంలో చెలరేగిన మంటల్లో ఆరుగురు సజీవదహనమయ్యారు. ఔరంగాబాద్ సమీపంలో ఉన్న వలుజ్ ఛత్రపతి శంభాజీనగర్ లో ఈ విషాద ఘటన జరిగింది. ఆదివారం (డిసెంబర్31) తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో వలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందని ఒక అధికారి తెలిపారు.

అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోగానే కర్మాగారం మొత్తం అగ్నికి ఆహుతైనట్లు వెల్లడించారు. కర్మాగారంలో ఆరుగురు ఉన్నట్లు స్థానికులు చెప్పగా.. తమ సిబ్బంది లోపలికి వెళ్లి వారి మృతదేహాలను వెలికి తీశారని వివరించారు. కాగా.. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 10-15 మంది నిద్రిస్తున్నామని, కొందరం మాత్రం తప్పించుకోగలిగామని కార్మికులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అవ్వడం విషాదం నింపింది. కాగా. అగ్నిప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×