E-Paper

ఆత్మీయులు దూరమైనందుకు బాధపడుతున్నారా? మనోధైర్యం నింపే భగవద్గీత బోధనలు మీ కసమే

ఆత్మీయులు దూరమైనందుకు బాధపడుతున్నారా? మనోధైర్యం నింపే భగవద్గీత బోధనలు మీ కసమే
Advertisement

మనకు ఎంతో ప్రియమైన వ్యక్తి దూరమైతే ఆ బాధను భరించడం సులభం కాదు. అలాంటి సమయంలో మనసు చాలా కలత చెందుతుంది. పాత జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు వస్తుంటాయి. జీవితం ఆగిపోయినట్లు కూడా అనిపిస్తుంది. అయితే భగవద్గీత మనలో ఆశను, ధైర్యాన్ని అందించే ఎన్నో బోధనలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుంటే జీవితాన్ని కొత్త కోణంలో చూడగలుగుతాం.

బాధ ఎప్పటికీ ఉండదు

ఈరోజు ఎదురవుతున్న కష్టం చాలా పెద్దదిగా అనిపించవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ బాధ తగ్గిపోతుంది. భగవద్గీత ప్రకారం సుఖం, దుఃఖం రెండూ జీవితంలో భాగాలే. మంచి రోజులు వచ్చినట్లే చెడు రోజులు కూడా వస్తాయి. అలాగే చెడు రోజులు కూడా శాశ్వతం కావు.

మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు

Advertisement

సంబంధాలు ముగిసిన తర్వాత చాలామంది తప్పంతా తమదేనని నిందించుకుంటారు. కానీ ప్రతి విషయానికీ మనమే కారణం కాదని భగవద్గీత చెబుతుంది. జీవితంలో జరిగే సంఘటనలకు అనేక కారణాలు ఉంటాయి. జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కానీ మనల్ని మనం తక్కువగా భావించుకొని ఆత్మనూన్యతు లోనుకాకూడదు.

వెళ్లిపోయిన వారిని వెళ్లనివ్వాలి

భగవద్గీత ప్రకారం ఈ ప్రపంచంలో మార్పు అనేది సహజం. ప్రతి వ్యక్తి జీవితాంతం మనతో ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది మన జీవితంలోకి వచ్చి కొన్ని పాఠాలు నేర్పించి వెళ్లిపోతారు. అందుకే వెళ్లిపోయిన వారి గురించి ఎప్పుడూ బాధపడుతూ ఉండకూడదు. వాస్తవాన్ని అంగీకరించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

మీ విలువను గుర్తించాలి

Advertisement

ఎవరైనా దూరమయ్యారని మీ విలువ తగ్గిపోదు. ఒక సంబంధం మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు. భగవద్గీత మనకు ఆత్మగౌరవాన్ని నేర్పుతుంది. ఇతరులపై ఆధారపడకుండా మన సంతోషాన్ని మనమే నిర్మించుకోవాలని చెబుతుంది. మనపై మనకు నమ్మకం ఉండటం చాలా ముఖ్యం.

ప్రతి అనుభవం ఏదో ఒక పాఠం నేర్పుతుంది

మంచి అనుభవాలు మాత్రమే కాదు, చెడు అనుభవాలు కూడా ఎన్నో విషయాలను నేర్పిస్తాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి మనల్ని మరింత బలంగా తయారు చేస్తుంది. అనుభవాల ద్వారా మనలో పరిపక్వత పెరుగుతుంది. అందుకే ప్రతి సంఘటనలో ఒక పాఠాన్ని గుర్తించాలి.

Also Read: ఈ 5 విషయాల్లో గర్వం వినాశనానికి కారణం.. ఎంత గొప్ప వారైనా పాతాళానికి పడిపోతారు

ముందుకు సాగడమే నిజమైన సమాధానం

మనల్ని వదిలి వెళ్లిపోయిన వారి కోసం జీవితాంతం ఎదురు చూడడం సరైనది కాదు. భగవద్గీత ఎప్పుడూ కర్మను చేయాలని చెబుతుంది. జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. మన ఆనందానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జీవితాన్ని కొత్త ఆశలతో ముందుకు తీసుకెళ్లాలి.

ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభమే

ఒక అధ్యాయం ముగిసినప్పుడు మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇదే జీవిత సత్యం. భగవద్గీత మనలో కొత్త ఆశ, విశ్వాసాన్ని కలిగిస్తుంది. మనపై మనకు నమ్మకం ఉండాలి. భగవంతుడిపై భక్తిని పెంచుకోవాలి. రాబోయే రోజులు మరింత మంచిగా ఉంటాయని మన:స్ఫూర్తిగా నమ్మాలి.

బాధ శాశ్వతం కాదు. భగవద్గీత మనకు సహనం, ఆత్మవిశ్వాసం, ముందుకు సాగే ధైర్యాన్ని నేర్పుతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి ముగింపు కొత్త అవకాశాలకు నాంది అవుతుందని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

Related News

ఉదయన్నే ఇవి తింటే కడుపు నిండా గ్యాస్, ఛాతీలో మంట..

రత్నశాస్త్రం.. ఎంత కష్టపడి పనిచేసినా విజయం లభించడం లేదా? ఈ రత్నాలు ధరిస్తే అదృష్టం పట్టినట్లే

రోజంతా ఆఫీసులో అలసటగా ఉందా? పనిచేస్తూ ఈ ప్రొటీన్ స్నాక్స్ తింటే గంటల తరబడి ఫుల్ ఎనర్జీ

ఇంట్లో లక్ష్మీదేవి రూపం ఆడబిడ్డ.. పాపకు 3 అక్షరాల అర్థవంతంమైన, సులభంగా పలికే పేర్లు ఇవిగో

ఫ్రిజ్‌లో పెట్టినా పచ్చిమిర్చి చెడిపోతోందా? ఈ చిట్కా పాటిస్తే వారాల తరబడి బాగుంటుంది

ఇంట్లో సంపద, శుభం కోసం మనీ ప్లాంట్ పెంచుతున్నారా? ఈ మూడు మొక్కలు దాని కంటే బెటర్

స్టెంట్ వేసుకున్న తర్వాత కూడా హార్ట్ అటాక్ వస్తుందా? గుండె డాక్టర్ చెప్పిన సమాధానమిదే

×