Private School: స్వేచ్ఛ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లాలో అనుమతులు లేకుండానే ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా నిర్వహణను కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకునే విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
వలిగొండ మండల కేంద్రంలో శ్రీ చైతన్య స్కూల్ పేరుతో నిర్వహిస్తున్న పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేవని అయినప్పటికీ నిర్వహణ ఎలాగా సాగిస్తున్నారని ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై అనుమతులు లేకుండానే పాఠశాల నిర్వహిస్తున్న చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరికి అందాల్సిన అమ్యామ్యాలు వారికి అందడంతో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్.. పారిస్ వేదికగా ఇరుదేశాల సంతకాలు, ఒప్పందంలోని కీలక అంశాలివే
గత సంవత్సరం కూడా అనుమతులు లేకుండానే పాఠశాల నిర్వహించారని అనేకమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఈ సంవత్సరం కూడా ఈ పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహణ ఎలా సాగిస్తున్నారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అనుమతులు లేకుండానే వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ, బుక్స్ యూనిఫార్మ్స్ వంటివి విక్రయాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read: కళ్ల జోడు పెట్టుకుని గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్…బౌన్సర్ తో తిక్క కుదిర్చిన ఆర్చర్