Summer Health Tips: ప్రస్తుతం మండిపోతున్న ఎండలు తీవ్రతకు చల్లటి ఐస్ క్రీమ్ తినడం అందరికీ ఇష్టమే. పిల్లల నుంచి పెద్దల దాకా మధ్యాహ్నం కాగానే చల్లదనం కోసం దీనిని ఆశ్రయిస్తారు. అయితే, ఈ అలవాటు అందరికీ మంచిది కాదని, ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఐస్ క్రీమ్కు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
బయట షాపుల్లో దొరికే ఐస్ క్రీముల్లో చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు వీటిని తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అలాగే, ఇందులో ఉండే శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా దీనికి దూరంగా ఉండటం మంచిది.
ఫ్యాటీ లివర్ (కాలేయ సమస్యలు) ఉన్న రోగులు ఐస్ క్రీమ్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. అధిక మొత్తంలో ఉండే చక్కెర, కొవ్వులు కాలేయంపై అదనపు భారాన్ని పెంచుతాయి. ఇది కాలేయ వ్యాధిని మరింత తీవ్రం చేస్తుంది.
Also Read: 60 రోజుల పాటు చక్కెర మానేస్తే.. మన శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
చాలామంది ఐస్ క్రీమ్ ఇచ్చే తాత్కాలిక చల్లదనాన్నే చూస్తారు కానీ, అది జీర్ణవ్యవస్థపై చూపే ప్రభావాన్ని గమనించరు. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారికి దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. పైగా ఎండకాలంలో మరీ చల్లని పదార్థాలు తింటే అసిడిటీ, అజీర్తి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
ఐస్ క్రీమ్కు బదులుగా ఇంట్లో తయారుచేసిన గడ్డ పెరుగు, ఫ్రూట్ స్మూతీలు, తాజా పండ్లను తీసుకోవడం ఎంతో మేలు. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడతాయి. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మజ్జిగ, కొబ్బరినీళ్లు, తాజా పండ్ల రసాలు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: సమ్మర్లో ఫ్రిడ్జ్ కరెంట్ బిల్లు హాఫ్ అవ్వాలంటే.. ఈ సింపుల్ చేంజెస్ చేసుకుంటే చాలు!