E-Paper
Advertisement

Tollywood: కన్న కొడుకునే చనిపోవాలని కోరుకున్న స్టార్ నటుడు.. ఎవరు ?ఎందుకో తెలుసా?

Tollywood: కన్న కొడుకునే చనిపోవాలని కోరుకున్న స్టార్ నటుడు.. ఎవరు ?ఎందుకో తెలుసా?

Tollywood:ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటారు. కానీ, సీనియర్ నటుడు ప్రసాద్ బాబు మాత్రం తన కొడుకు తనకంటే ముందే చనిపోవాలని దేవుడిని ప్రార్థించారట. వినడానికి షాకింగ్‌గా ఉన్నా, దీని వెనుక ఒక తండ్రి పడిన ఆవేదన, అంతులేని ప్రేమ దాగి ఉన్నాయి. దాదాపు 1500 సినిమాల్లో నటించిన ఈ విలక్షణ నటుడు, తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అత్యంత విషాదకరమైన సంఘటనను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకుని అందరినీ కన్నీరు పెట్టించారు.

మానసిక వైకల్యం.. ఒక తండ్రి తపన: 

ప్రసాద్ బాబు పెద్ద కొడుకు పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. మాటలు కూడా రావు. మేనరికం పెళ్లి చేసుకోవడం వల్లే తన కొడుకు ఇలా పుట్టాడని ప్రసాద్ బాబు ఇప్పటికీ బాధపడుతుంటారు. అయితే తన కొడుకు ఎప్పుడూ తక్కువ కాకూడదని, ప్రతి సినిమా షూటింగ్‌కు తనతో పాటే తీసుకెళ్లేవారట. ఇక తన కొడుకుని ఒక కళాకారుడిగా చూడాలనే ఆశతోనే ‘సాహస బాలలు’ అనే సినిమా తీశారు. ఆ సినిమాకు బంగారు నంది అవార్డు కూడా వచ్చింది. కొడుకుపై ఉన్న ప్రేమే ఆయన్ని దర్శకుడిగా మార్చింది.

30 ఏళ్ల వయసులో ఊహించని మరణం:

తన కొడుకుకు 30 ఏళ్లు వచ్చినప్పుడు ఒక వేసవి కాలంలో క్రికెట్ ఆడుతుండగా వడదెబ్బ తగిలింది. గ్రౌండ్‌లోనే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆ వార్త విన్నప్పుడు ప్రసాద్ బాబు కుప్పకూలిపోలేదు సరే కదా, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారట. ఇక తన కళ్ల ముందే కొడుకు ప్రాణాలు వదిలినందుకు ఒక తండ్రిగా ఆయనకు ఎంతో బాధ ఉన్నా, మరోవైపు ఒక పెద్ద భయం నుండి విముక్తి లభించినట్లు అనిపించిందని ఆయన ఆవేదనగా చెప్పుకొచ్చారు.

నేను లేకపోతే వాడిని ఎవరు చూస్తారు?:

ప్రసాద్ బాబు మనసులో ఉన్న పెద్ద భయం ఏంటంటే.. “నేను బతికున్నంత కాలం నా కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటాను. కానీ, రేపు నేను చనిపోయాక వాడిని ఎవరు చూస్తారు? ఎవరైనా సరిగ్గా భోజనం పెడతారా? వాడిని సరిగ్గా చూసుకుంటారా?” అనే ఆలోచన ఆయన్ని నిద్రపోనిచ్చేది కాదు. ఇక అందుకే, ఆ అనాథ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే కొడుకు తనకంటే ముందే చనిపోవాలని మనసులో కోరుకున్నారట. ఆ కోరిక నెరవేరడంతో తన కొడుకు ఏ లోటు లేకుండా తన చేతుల్లోనే వెళ్ళిపోయాడనే తృప్తిని వ్యక్తం చేశారు.

ALSO READ:Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ఆయన లోటు తీర్చరానిది!

1500 సినిమాల ప్రస్థానంలో తీరని లోటు:

ప్రసాద్ బాబు (అసలు పేరు కరణం లీల వెంకట శ్రీహరి నాగ వరప్రసాద్) ‘పునాదిరాళ్లు’ సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టి, తెలుగు, తమిళ భాషల్లో 1500 సినిమాలు చేశారు. రుద్రవీణ, ఆపద్భాందవుడు వంటి ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించినా, తన కొడుకు విషయంలో ఆయన పడిన ఆవేదన మాత్రం తీరనిది. ఇక ఏ తండ్రికీ రాకూడని పరిస్థితి ఆయనకు ఎదురైంది. ఒక బాధ్యత గల తండ్రిగా ఆయన పడిన ఆరాటం, తీసుకున్న నిర్ణయం చూస్తుంటే ఎవరికైనా మనసు భారమవుతుంది.

Related News

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

Big Stories

×