E-Paper
Advertisement

Hema: ఆ నరకం ఎప్పటికీ మరువలేనిది.. మానసికంగా ఇబ్బంది పెట్టారంటూ హేమ ఎమోషనల్!

Hema: ఆ నరకం ఎప్పటికీ మరువలేనిది.. మానసికంగా ఇబ్బంది పెట్టారంటూ హేమ ఎమోషనల్!
Advertisement

Hema: ఇండస్ట్రీలో దశాబ్ద కాలానికి పైగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అతి కొద్ది మంది నటీమణులలో హేమా (Hema ) కూడా ఒకరు. అమ్మ, అక్క, చెల్లి, వదిన, అత్త ఇలా పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. తన జీవితంలో ఆరోజు ఎప్పటికీ మర్చిపోలేనిదని, మానసికంగా తనను కొంతమంది ఇబ్బంది పెట్టారు అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది. విషయంలోకి వెళ్తే రెండేళ్ల క్రితం బెంగళూరులో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

డ్రగ్స్ కేసు పై మళ్లీ స్పందించిన హేమ..

ముఖ్యంగా ఈ కేసులో పలువురు తెలుగు వ్యక్తుల పేర్లు వినిపించడంతోపాటు సీనియర్ నటి హేమ పేరు కూడా బయటకు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అనంతరం హేమాకి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆ వివాదం కాస్త క్రమంగా సద్దుమణిగింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది.. ఇకపోతే ఇప్పుడు తెలంగాణలో వరుసగా డ్రగ్స్ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. ఆ పాత కేసును ప్రస్తావిస్తూ తాజాగా హేమ ఎమోషనల్ కామెంట్లు చేసింది. ఈ నేపథ్యంలో గతంలో బెంగళూరులో జరిగిన డ్రగ్స్ కేసును గుర్తు చేసుకుంటూ హేమ ఇలా చెప్పుకొచ్చింది. మే 19 2024న బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జి ఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారం మేరకే పోలీసులు మే 20 తెల్లవారుజామున దాడులు చేపట్టారు. ఆ సమయంలో మొత్తం 88 మందిపై కేసులు నమోదు చేయగా.. వారిలో 9 మంది నిర్వాహకులు, మిగిలిన వారిపై డ్రగ్స్ వినియోగించారన్న ఆరోపణల కింద కేసు నమోదు అయింది..

నిర్దోషిని అని తేలినా నమ్మలేదు..

Advertisement

ముఖ్యంగా నాతో పాటు 79 మంది డ్రగ్స్ వినియోగించారన్న ఆరోపణలతో పోలీసులు కోర్టులో 1000కి పైగా పేజీలతో చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో నేను ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదని చెప్పినప్పటికీ నాపై ఎక్కువగా ఆరోపణలు కొనసాగాయి. కారణం నేనొక సెలబ్రిటీ. కొన్ని మీడియా సంస్థలు నాపై వచ్చిన ఆరోపణలను పదే పదే ప్రసారం చేసినప్పటికీ.. తర్వాత నేను నిర్దోషిని అని తేలిన విషయాన్ని మాత్రం ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు” అంటూ విమర్శలు గుప్పించింది.

ALSO READ:Film industry: ఇండస్ట్రీలో విషాదం.. డోరేమాన్ దర్శకుడు మృతి!

హేమ ఆవేదన..

Advertisement

2025 జనవరి 2న బెంగళూరు కోర్టు నా వాదనలు పరిశీలించి నేను డ్రగ్స్ వినియోగించలేదని తేల్చి నాకు క్లీన్ చిట్ ఇచ్చింది.. దీంతో నేను నిర్దోషినని న్యాయపరంగా నిరూపితమైంది ..కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో నన్ను తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురి చేశారు. ఎన్నోసార్లు నేను నా తప్పు లేదని చెప్పినా సరే ఎవరూ నమ్మలేదు.. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే నిజం బయటపడింది. డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయితేనే దోషులని భావించడం సరైనది కాదు.. జైలుకు వెళ్ళినంత మాత్రాన ఎవరూ నేరం చేసినట్టు కాదు.. దయచేసి ఇతరుల జీవితాలతో ఆడుకోవద్దు.. ఆ నరకం నుండి ఆ బాధ నుండి నేను ఇప్పటికి బయటపడలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది హేమ. ప్రస్తుతం హేమ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×