Kayadu Lohar : కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన మూవీ డ్రాగన్ హీరోయిన్ కాయదు లోహర్.. ఈ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో చేసిన సినిమాలు ఏమో గానీ ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. మోడల్గా కెరీర్ ను ప్రారంభించిన కాయదు.. అంతేకాదు ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్లో విజేతగా నిలిచింది. అదే సంవత్సరం కన్నడ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్క మూవీతో ప్రశంసలు అందుకుంది.
ఇక ఆ తర్వాత మలయాళ మూవీ “పాథోన్పథం నూట్టండు” లో నటించింది. ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఇక తెలుగులో పులి: ది నైంటీంత్ సెంచరీ పేరుతో మరో మూవీలో నటించింది.. రీసెంట్గా విశ్వక్సేన్ మూవీలో నటించింది.. అయితే ఈమె గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియా కి గుడ్ బై చెప్పేసింది అంటూ ఓ వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది. నిజంగానే ఈమె సోషల్ మీడియా కి గుడ్ బై చెప్పేసిందా? అసలేం జరిగింది ఎందుకు ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్నది ఇప్పుడు కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
బ్యూటిఫుల్ హీరోయిన్ కాయదు లోహర్ రీసెంట్గా తెలుగులో విశ్వక్ సేన్ నటించిన ఫంకీ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. అయితే ఈ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయిన కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఈమె ఖాతాలో యావరేజ్ సినిమా పడిపోయింది.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటు బిజీగా ఉంది.. ఈ క్రమంలో ఈ అమ్మడు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఎవరైనా హీరోయిన్గా క్రేజ్ పెరుగుతున్న కొద్ది సోషల్ మీడియాలో బిజీగా ఉండాలని అనుకుంటారు. తమ సినిమాల గురించి అందరికీ చెబుతూ అభిమానుల్ని ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ఈ ముద్దుగుమ్మ మాత్రం సోషల్ మీడియాకి బ్రేక్ తీసుకుంటున్నానని ప్రకటించింది. అసలు ఎందుకు ఈమె ఈ నిర్ణయం తీసుకుందో ఎవరికి అర్థం కాలేదు. ప్రస్తుతం ఇదైతే నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కాయలు సోషల్ మీడియా కి గుడ్ బై చెప్పడానికి కారణం ఓ హీరో అంటూ మరో వార్త షికారు చేస్తుంది.. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఈ హీరోయిన్ రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న బ్యూటి కాయదు.. తమిళంలో ఏమి చేసిన సినిమాలు అన్ని పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. తెలుగులో ఈమె చేసిన ఒక్క సినిమా ఫంకి.. భారీ అంచనాలతో వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను అందుకుంది. ప్రస్తుతం తెలుగులో నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ మూవీలో నటించింది.. భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఆ సినిమాల గురించి వెల్లడించే అవకాశం కూడా ఉంది..