Indian Famous Temples: భారతదేశం ఆధ్యాత్మికతకు, పురాతన సంస్కృతికి పెట్టింది పేరు. ఇక్కడి అణువణువునా భక్తి భావం ఉట్టిపడుతుంది. అయితే దేశంలో వేలాది ఆలయాలు ఉన్నప్పటికీ.. చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత పరంగా కొన్నింటికి ప్రత్యేక స్థానం ఉంది. పర్యాటకులు, భక్తులు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా తప్పక సందర్శించాలని పండితులు చెబుతుంటారు. అలాంటి 7 అత్యంత విశిష్టమైన దేవాలయాలు, వాటి ప్రత్యేకతల గురించి ఈ కథనంలో చూద్దాం.
గంగా నది తీరాన కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం సాక్షాత్తూ ఆ పరమశివుడికి నిలయంగా చెబుతుంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోయి మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భారతదేశ ఆధ్యాత్మిక రాజధానిగా ప్రసిద్ధి చెందిన వారణాసిలో కాలుమోపడం ప్రతి ఒక్కరికీ ఒక అద్భుతమైన ఆత్మీయ అనుభూతిని మిగులుస్తుంది.
ప్రపంచంలోనే అత్యధిక మంది భక్తులు సందర్శించే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల. కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం ప్రతిరోజూ వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. స్వామివారి ఒక్క క్షణం దర్శనం కోసం భక్తులు గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి క్యూలైన్లలో ఎంతో ఓర్పుగా వేచి ఉండి తమ భక్తిని చాటుకుంటారు.
హిమాలయ పర్వతాల ఒడిలో ఉన్న కేదార్నాథ్.. పవిత్ర చార్ ధామ్ యాత్రా స్థలాల్లో ఒకటి. ఇది పరమశివుని పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటిగా కీర్తించబడుతోంది. అయితే కేదార్నాథ్ చేరుకునే ప్రయాణం అంత సులభం కాదు. ఇది భక్తుల విశ్వాసానికి, వారి శారీరక దృఢత్వానికి కఠినమైన పరీక్ష పెడుతుంది.
ద్రావిడ వాస్తుశిల్పానికి సజీవ సాక్ష్యంగా నిలిచే మధురైలోని ఈ ఆలయం మీనాక్షి దేవి, సుందరేశ్వర స్వామి వార్లకు అంకితం చేయబడింది. ఆకాశాన్ని తాకేలా ఉండే ఇక్కడి భారీ గోపురాలు, వాటిపై చెక్కిన అద్భుత శిల్పకళ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి.
చార్ ధామ్ క్షేత్రాలలో ఒకటైన పూరీ జగన్నాథుని ఆలయం.. వార్షిక రథయాత్రకు అత్యంత ప్రసిద్ధి. దారిపొడవునా ఎంతో ఘనంగా జరిగే ఈ మహా రథోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు ప్రతి ఏటా దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఒడిశాకు బారులు తీరుతారు.
చరిత్రలో ఎన్నో విదేశీ దండయాత్రలను తట్టుకొని ఈ ఆలయం పునః నిర్మితమైంది. గుజరాత్ లోని సోమనాథ్ టెంపుల్ మన దేశ పట్టుదలకు, అచంచలమైన భక్తికి ప్రతీక. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయం.. సాక్షాత్తూ ఆ శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది కావడం విశేషం.
Also Read: మార్కెట్లోకి All-in-One మిక్సీ.. 1 మిషన్, 10 రకాల పనులు.. హెవీ డ్యూటీకి కేరాఫ్!
సిక్కుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం.. కుల మతాలకు అతీతంగా అందరినీ సమానంగా ఆదరిస్తుంది. ఇక్కడి ప్రశాంత వాతావరణం, భక్తులందరికీ ఉచితంగా భోజనం అందించే మహా అన్నదాన కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంటుంది. సాటి మనుషుల పట్ల చూపించాల్సిన కరుణ, సమానత్వాన్ని ఈ ఆలయం వెలుగెత్తి చూపిస్తుంది.
Also Read: మెున్న శ్రీరెడ్డి, నిన్న పోసాని, నేడు బోరుగడ్డ.. అయ్యో అయ్యో అయ్యయ్యో?