E-Paper
Advertisement

Allu Arjun: పుష్ప2 సినిమాకు ఏడాది.. మరిచిపోలేని ప్రయాణం అంటూ బన్నీ ట్వీట్!

Allu Arjun: పుష్ప2 సినిమాకు ఏడాది.. మరిచిపోలేని ప్రయాణం అంటూ బన్నీ ట్వీట్!
Advertisement

Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)సుకుమార్(Sukumar) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ చిత్రం పుష్ప.  గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల అయ్యి నేటికి సరిగ్గా ఏడాది అవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మీతో ప్రయాణం గౌరవంగా ఉంది..

ఈ సందర్భంగా అల్లు అర్జున్ సుకుమార్ తో కలిసి పుష్ప 2 షూటింగ్ లొకేషన్లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. పుష్ప మా జీవితంలో మర్చిపోలేని ఐదు సంవత్సరాల ప్రయాణం అంటూ చెప్పుకువచ్చారు. ఈ సినిమాకు ప్రేక్షకులు అపారమైన ప్రేమ, మద్దతు ధైర్యాన్ని ఇచ్చి ఒక అద్భుతం చేశారని తెలిపారు. ఇలా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. ఇక ఈ ఐదు సంవత్సరాల ప్రయాణంలో ఎంతోమంది సాంకేతిక నిపుణులు చిత్ర బృందం మా కెప్టెన్ సుకుమార్ గారితో కలిసి ఈ ప్రయాణం చేయటం ఎంతో గౌరవంగా ఉందని తెలిపారు. ఈ ప్రయాణంలో భాగమైనందుకు మీ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ అల్లు అర్జున్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

పుష్ప 3 పై భారీ అంచనాలు…

Advertisement

గత ఐదు సంవత్సరాల క్రితం పుష్ప సినిమా షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయని ఐదు సంవత్సరాలు పాటు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినట్లు ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలియజేశారు . అయితే పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ సినిమాకు ఊహించని విధంగా ఆదరణ లభించిన నేపథ్యంలో పుష్ప3 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి ..ఇక ఈ సినిమా షూటింగ్ మరికాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.

Advertisement

ఈ సినిమా షూటింగ్ 2027లో ప్రారంభం కాబోతుందని చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా  సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ సైతం రామ్ చరణ్  తో మరో సినిమాకు కమిట్ అయ్యారు ఈ సినిమా 2026లో షూటింగ్ పనులు ప్రారంభం కానుంది.. ఈ విధంగా సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరి సినిమాలు పూర్తి అయిన తరువాత పుష్ప 3 పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

Also Read: Jatadhara OTT : ఓటీటీలోకి వచ్చిన సుధీర్ బాబు జటాధర..ఎక్కడ చూడొచ్చంటే!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×