Mysterious Lady: టీమిండియా – సౌత్ ఆఫ్రికాల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రాంచి, రాయిపూర్ లలో రెండు వన్డేలు పూర్తయ్యాయి. ఇక మూడవ వన్డే మ్యాచ్ విశాఖపట్టణం వేదికగా శనివారం రోజు జరగబోతోంది. మొదటి వన్డే ని భారత్ 17 పరుగుల తేడాతో గెలుచుకుంది.
ఇక రెండవ వన్డేని సౌత్ ఆఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో గెలుచుకుంది. దీంతో మూడవ వన్డే కీలకంగా మారింది. ఈ మూడవ వన్డే కోసం భారత జట్టు ఇప్పటికే విశాఖపట్నం చేరుకుంది. అయితే భారత ఆటగాళ్లు రాయిపూర్ నుండి విశాఖపట్నం వెళుతున్న సమయంలో విరాట్ కోహ్లీ తో ఓ అమ్మాయి దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
రేపు దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య విశాఖ వేదికగా మూడవ వన్డే జరగబోతోంది. ఈ క్రమంలో రాయిపూర్ నుండి విశాఖపట్నం వెళ్లే సమయంలో హెయిర్ క్రాఫ్ట్ లో టీం ఇండియా ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో కలిసి ఓ యువతి తీసుకున్న సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఆ యువతీ తన కెమెరాతో సెల్ఫీ తీసుకోగా.. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ట్రావెల్ కిట్ ధరించి ఉన్నారు. వీరిద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు ఫోజులు ఇవ్వడం ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యువతి పేరు సిఎస్ పూర్వి చోప్రా. ఈమె విరాట్ కోహ్లీకి వీరాభిమాని. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో దిగిన ఫోటోని సిఎస్ పూర్వీ చోప్రా తన {ఎక్స్} ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసేది. కానీ ఇది ఒరిజినల్ ఫోటో కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ {ఏఐ} ఫోటో అని తెలుస్తోంది.
రెండవ వన్డే పూర్తయ్యే సమయం వరకు విశాఖపట్నంలో టికెట్ల అమ్మకాలు చెప్పుకోదగ్గ స్థాయిలో జరగలేదని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు తెలిపారు. కానీ విరాట్ కోహ్లీ రాంచీలో మాత్రమే కాకుండా రాయిపూర్ లోనూ రెండవ సెంచరీ చేయడంతో ఒక్కసారిగా టికెట్ల విక్రయాలు ఊపందుకున్నాయని వారు వివరించారు. ఈ టికెట్ల విక్రయాలు నవంబర్ 28న ప్రారంభమయ్యాయి. కానీ కోహ్లీ రెండవ సెంచరీ చేసిన తర్వాత నిమిషాల్లోనే టికెట్లు అన్నీ అమ్ముడుపోయాయి అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీడియా అండ్ ఆపరేషన్స్ టీం తెలిపింది.
Also Read: Ravi Shastri: కోహ్లీ, రోహిత్ల జోలికి రావొద్దు… గంభీర్ కు హెచ్చరిక
మొదటి వన్డేలో 135 పరుగులతో చెలరేగిన విరాట్ కోహ్లీ.. డిసెంబర్ 30న జరిగిన రెండవ వన్డేలో కూడా సెంచరీ చేశాడు. కోహ్లీ ఇప్పటివరకు వన్డేలలో 53 సెంచరీలు చేశాడు. 35 ఏళ్ల వయసులో కూడా అగ్రెసివ్, ఫిట్నెస్ విషయంలో యువ ఆటగాళ్లకు రోల్ మోడల్ గా నిలుస్తున్నాడనటంలో సందేహం లేదు. టన్నులకొద్దీ పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. ఇప్పటికీ వికెట్ల మధ్య చిరుతను మించిన వేగంతో పరిగెత్తుతున్నాడు.
Casually shared a flight with Ro-Ko today ♥️#ROKO #KingKohli pic.twitter.com/ihZG6ZtO0t
— CS Purvi Chopra🍪 (@PuruBaby21) December 4, 2025