E-Paper
Advertisement

HHVM Pre Release Event: వీరమల్లు నాకెంతో ప్రత్యేకం… పవన్ విశ్వరూపం చూస్తారు!

HHVM Pre Release Event: వీరమల్లు నాకెంతో ప్రత్యేకం… పవన్ విశ్వరూపం చూస్తారు!
Advertisement

HHVM Pre Release Event: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదులోనే శిల్పకళా వేదికలో జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సతీసమేతంగా హాజరై సందడి చేశారు. ఈ సినిమా జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నేడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అభిమానులు కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత ఏ. ఏం రత్నం(A.M.Ratnam) మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తన సినీ కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసినప్పటికీ నాకు హరిహర వీరమల్లు సినిమా చాలా ప్రత్యేకమని తెలిపారు.

పవన్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా చిత్రం…

Advertisement

ఈ సినిమా ఒక హిస్టారికల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదలైన చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరిగాయా అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటారని నిర్మాత తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమా కావటంతో ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్ మారిందని తెలిపారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన సినీ కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావటం విశేషమని రత్నం తెలిపారు.

వీరమల్లు ఆలోచింపజేసే సినిమా…

Advertisement

ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కాలంలో ఇలా జరిగిందా? అని అందరిని ఆలోచింపజేసే సినిమా ఇది అని తెలిపారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు అంటూ నిర్మాత రత్నం ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇక ఈ సినిమా కోసం ఇన్ని సంవత్సరాలు పాటు మాతో కలిసి నడిచిన టెక్నీషియన్లు అందరికీ కూడా ఈ సందర్భంగా రత్నం ధన్యవాదాలు తెలియజేశారు. ఇక కీరవాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మంత్రులకు రత్నం ధన్యవాదాలు తెలియజేశారు.

టికెట్ల ధరలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం..

ఇక తెలంగాణ ప్రభుత్వం (Telangana Government)కూడా ఈ సినిమాకు ప్రత్యేకంగా స్పెషల్ షో అనుమతి తెలపడమే కాకుండా సినిమా టికెట్ల ధరలను కూడా పెంచిన నేపథ్యంలో ఏఎం రత్నం తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని తప్పనిసరిగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ నిర్మాత ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులలో మరిన్ని అంచనాలను పెంచేశాయి. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సోలో హీరోగా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ (Nidhi Agerwal) నటించిన సంగతి తెలిసిందే.

Also Read: Udaipur Files: ఉదయపూర్ ఫైల్స్ వివాదం.. కేంద్రం కీలక మార్పులు.. విడుదలకు లైన్ క్లియర్ అయ్యేనా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×