E-Paper
Advertisement

Anchor Sreemukhi : ముప్ప తిప్పలు తర్వాత ముగిసిన శ్రీముఖి విచారణ

Anchor Sreemukhi :  ముప్ప తిప్పలు తర్వాత ముగిసిన శ్రీముఖి విచారణ
Advertisement

Anchor Sreemukhi : టెక్నాలజీ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. అయితే టెక్నాలజీని ఉపయోగించుకునే విధానం పైనే అంత ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అంటే ఎవరికి తెలియదు. ఎక్కడో గ్రామాల్లోను, పట్టణాల్లోనూ కోళ్ల పందాలు, పేకాట ఇలాంటి జరుగుతూ ఉండేవి. అయితే వాటిని అడ్డుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఎలానో ఉంది కాబట్టి వాళ్ల స్థాయిలో వాళ్లు వాటిని అరికట్టగలిగారు.

కానీ మొబైల్ లో బెట్టింగ్ ఆడటం అనేది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్లు ఆలోచించాల్సిన విషయం. దానివలన ఏం కోల్పోతాము అనే రిలైజేషన్ వచ్చేసరికి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. చాలామంది బెట్టింగ్ యాప్స్ వలన ప్రాణాలు తీసుకున్నారనే వార్తలు కోకొల్లలు. ఈ బెట్టింగ్స్ అనేవి ఎవరో ఒక పెద్ద సెలబ్రిటీ దానిని ప్రమోట్ చేయడం వలనే సాధారణ ప్రేక్షకుడికి తెలుస్తుంది. ఇంతటి సెలబ్రిటీ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఉంది అని ఆసక్తికరంగా దానిని మొదలుపెడతారు. అలానే వాటికి అలవాటైపోతారు.

ముగిసిన శ్రీముఖి విచారణ 

Advertisement

చాలామంది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్ వంటి వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లందర్నీ విచారణ చేసిన సంగతి తెలిసిందే. అలానే ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా బెట్టింగ్ యాక్షన్ ప్రమోట్ చేశారు. ఇప్పుడు తనని కూడా సిఐడి అధికారులు విచారించారు.

దాదాపు గంటన్నర సమయం పాటు శ్రీముఖిని సిఐడి అధికారులు విచారించారు. శ్రీముఖి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వివరాలన్నిటిని సిఐడి డిపార్ట్మెంట్ సేకరించారు. అలానే శ్రీముఖి బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా అడిగి తీసుకున్నారు.

Advertisement

అయితే శ్రీముఖికి ఆ విచారణలో ఎటువంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. తను ఏమి జవాబు ఇచ్చారు. అనే అంశాలు ఇంకా బయటకు రాలేదు. అయితే వీటి పైన శ్రీముఖి స్పందిస్తుందేమో వేచి చూడాలి.

నో బెట్టింగ్ యాప్స్

మొత్తానికి ఎక్కువ శాతం బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వెబ్సైట్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. అక్కడక్కడ కొంత మేరకు బెట్టింగ్స్ ఆడటానికి అవకాశం ఉండేటట్టు కొన్ని సైట్స్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ గా క్లోజ్ అయిపోతే, చాలామంది కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పొచ్చు. అసలు ఎలా ఉంటుందో అని ఎంట్రీ ఇచ్చి దాని నుంచి బయట పడలేక ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు చాలామంది యువత. వారందరినీ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఇంకా సెలబ్రిటీలు కూడా మళ్లీ ప్రమోషన్స్ చేయకుండా ఉంటే అదే అసలైన మేలు.

Also Read: Telugu directors: రాజమౌళినే కాదు, ఈ దర్శకులు కూడా దేవుళ్ల పై మాట్లాడారు

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×