E-Paper
Advertisement

Couple friendly: A సర్టిఫికెట్ పై ధీరజ్ అసహనం.. పీఎంను కలుస్తానంటూ!

Couple friendly: A సర్టిఫికెట్ పై ధీరజ్ అసహనం.. పీఎంను కలుస్తానంటూ!
Advertisement

Couple friendly: అశ్విన్ చంద్రశేఖర్ (Ashwin Chandrasekhar) దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్(Santhosh Sobhan), మానస వారణాసి(Manasa Varanasi) జంటగా నటించిన తాజా చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.. పైగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నాకు వర్షం సినిమా లాగే సంతోష శోభన్ కి ఈ సినిమా అలా నిలిచిపోతుంది అంటూ ఆయన తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.

కపుల్ ఫ్రెండ్లీ పై రెబల్ స్టార్ ప్రశంసలు..

ముఖ్యంగా రెబల్ స్టార్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో అటు ఆడియన్స్ కూడా ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు A సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు రాకపోవడం సెన్సార్ వల్లే అంటూ నిర్మాత ధీరజ్ మొగిలినేని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సెన్సార్ పై నిర్మాత అసహనం..

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..” ఈరోజు శివరాత్రి పండుగ కావడంతో అటు ఫ్యామిలీలు, పిల్లలతో కలిసి సినిమా చూడాలనుకున్నా ఈ A సర్టిఫికెట్ వల్ల వాళ్ళు థియేటర్లకు రాలేకపోతున్నారు . దీనివల్ల మా సినిమాకు ఎంత అప్రిసియేషన్ వచ్చినప్పటికీ నిర్మాతగా మాకు దక్కాల్సిన రెవెన్యూ మాత్రం దక్కడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ సినిమాకే కాకుండా ఈ ఏడాది దాదాపు 5 చిత్రాలకు ఇలాంటి యూ/ఏ సర్టిఫికెట్ సమస్యలు ఎదురయ్యాయి అంటూ ఆయన గుర్తు చేసుకున్నారు.

దిల్ రాజును సంప్రదించినా ప్రయత్నం లేదు..

ఈ సమస్యపై దిల్ రాజును సంప్రదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సెన్సార్ నిర్ణయాలు ముంబై నుంచి వస్తున్నాయి కాబట్టి మేమేం చేయలేమని దిల్ రాజు కూడా చేతులెత్తేశారు. కానీ మా బాధను చెప్పుకోవడానికి అవసరమైతే ప్రధాని మోదీ దగ్గరకైనా వెళ్లి మా బాధను చెప్పుకుంటాము. అప్పుడైనా మాకు న్యాయం జరుగుతుందేమో.. ఇలాంటి సమస్యలు ఒక్క మా సినిమాకే కాదు ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 5 చిత్రాలు ఇదే సమస్యను ఎదుర్కొన్నాయి.. అంటూ ధీరజ్ మొగిలినేని చెప్పుకొచ్చారు.

Advertisement

ఇక ప్రస్తుతం ఈ సినిమాకి A సర్టిఫికెట్ రావడం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి వచ్చి చూడలేకపోతున్నారని.. తద్వారా రెవెన్యూ తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు ధీరజ్. ఇదిలా ఉండగా ఇదే కాంబినేషన్ ను సెట్ చేస్తూ మళ్ళీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న కూడా ఇలాగే ఒక లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నామని తెలిపారు. ఏది ఏమైనా మళ్లీ ఇదే కాంబినేషన్ రిపీట్ కాబోతోంది అని తెలిసి అభిమానులు ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం.

ALSO READ:Peddi Movie: పెద్ది మూవీలో కుషిత.. పోస్ట్ వైరల్

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×