Actor Ajith Kumar: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు అజిత్ కుమార్(Ajith Kumar) ఒకరు. ఈయన సినిమాల పరంగా ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక సినిమాలతో పాటు అజిత్ కు రేసింగ్ అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన రేసింగ్ పోటీలలో పాల్గొంటూ ఇప్పటికే ఎన్నో పథకాలను కూడా సొంతం చేసుకున్నారు. ఇలా నిత్యం కార్ రేస్ పోటీలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా నటుడు అజిత్ కుమార్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ప్రొఫెషనల్ రేసర్ గా అజిత్ కుమార్ ఎన్నో విజయాలను సాధించిన నేపథ్యంలో ఈయనకు “జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025″(Gentleman driver of the year 2025)అవార్డుతో సత్కరించారు. ఇటలీలోని వెనిస్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా అజిత్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. వేడుకలో ఫిలిప్ చారియోల్ మోటార్ స్పోర్ట్స్ గ్రూప్ ఈ అవార్డును అజిత్ కు అందించింది. ఇక ఈ అవార్డు వేడుకలలో భాగంగా ఆయన భార్య పిల్లలు కూడా పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలను అజిత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.
నటుడు అజిత్ కుమార్ ఈ విధమైనటువంటి అవార్డును సొంతం చేసుకున్న నేపథ్యంలో అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఈ ఫోటోలను శాలిని(Shalini) కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన భర్తకు దక్కిన ఈ గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాలిని స్పందిస్తూ.. వెనిస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నా భర్త పక్కన నిలబడటం చాలా గర్వంగా అనిపించిందని తెలిపారు.రేసింగ్ డ్రైవర్ దివంగత ఫిలిప్ చార్రియోల్(Philippe Charriol) గౌరవార్థం తన భర్తకు జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ద ఇయర్ 2025 అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఇలా అజిత్ కుమార్ కు ఈ విధమైనటువంటి అవార్డు రావడంతో ఆయన కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ.. ఫిలిప్ చార్రియోల్ గుర్తుగా ఈ అవార్డు అందుకోవటం సంతోషంగా ఉందని, చార్రియోల్ గురించి తాను చాలా గొప్పగా విన్నానని, ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని అజిత్ తెలిపారు. మొత్తానికి తనకు ఎంతో ఇష్టమైన ఈ రేసింగ్ భాగంగా ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకోవడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే ఈయన చివరిగా గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈయన తన తదుపరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
Also Read: Spirit pooja Ceremony: హమ్మయ్య స్పిరిట్ మొత్తానికి స్టార్ట్.. మెగాస్టార్ చేతుల మీదుగా..