Spirit pooja Ceremony: ప్రభాస్ అభిమానులు గత కొద్దిరోజులుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రభాస్(Prabhas) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి (Sandeep Reddy)దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాకు స్పిరిట్(Spirit) అని టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ప్రభాస్ అభిమానులు కొంత పాటి అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ప్రభాస్ అభిమానులకు సందీప్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.
ఇటీవల ఈయన నవంబర్ చివరి వారంలో స్పిరిట్ సినిమా పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. చెప్పిన విధంగానే ఈ సినిమా పూజా కార్యక్రమాల(Pooja Ceremony)ను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలలో ప్రభాస్ కనిపించకపోవడం గమనార్హం. ఇక సందీప్ రెడ్డి వంగాతో పాటు చిత్ర నిర్మాతలు హీరోయిన్ త్రిప్తి ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు. ఇలా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే ప్రభాస్ కి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తి అయిందని ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉండబోతోంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇక ప్రభాస్ ఇందులో పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు అలాగే ఖైదీగా కూడా కనిపించబోతున్నట్టు ఇటీవల ఒక ఆడియో టీజర్ ద్వారం వెల్లడించారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి తదితరులు కూడా కీలకపాత్రలలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
India’s biggest superstar #Prabhas’s SPIRIT has been launched with Megastar @KChiruTweets garu as the special guest. 🙏🔥 #BhushanKumar @imvangasandeep.@tripti_dimri23 @VangaPranay @ShivChanana#OneBadHabit@vivekoberoi @prakashraaj #KrishanKumar @neerajkalyan_24… pic.twitter.com/Xmq6O4jfwk
— Bhadrakali Pictures (@VangaPictures) November 23, 2025
ఇలా ఈ సినిమా పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభాస్ కనిపించకపోవడంతో మా రాజుగారు ఎక్కడ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ పతాకంపై ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏకంగా తొమ్మిది భాషలలో విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ బయటకు రావడంతో ప్రభాస్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: I Bomma Ravi Father: ఆ నిర్మాతను ఎన్కౌంటర్ చేసి పడేయ్యాలి.. ఐబొమ్మ రవి తండ్రి సంచలన వ్యాఖ్యలు