Nandamuri Mokshagna: ఈరోజు నారా కుటుంబంలో ఒక ప్రత్యేక వేడుక ఘనంగా జరిగింది. నారా లోకేష్.. నారా బ్రాహ్మిణి కుమారుడు నారా దేవాన్ష్ పంచల ఫంక్షన్ను కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం చాలా సాదాసీదాగా కానీ కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఆత్మీయంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన భార్య.. నారా భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు.
అలాగే ప్రముఖ నటుడు.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తన భార్య వసుంధరాతో కలిసి ఈ వేడుకకు వచ్చారు. కుటుంబ సభ్యులందరూ కలిసి తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుకలో బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా కనిపించారు. బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమెతో పాటు బాలకృష్ణ కొడుకు.. మోక్షజ్ఞ కూడా ఈ ఫంక్షన్కు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే మోక్షజ్ఞ చాలా రోజుల తర్వాత ఇలా పబ్లిక్గా కనిపించాడు.
ఈ కార్యక్రమంలో తీసిన ఫోటోలలో మోక్షజ్ఞ కనిపించడంతో సోషల్ మీడియాలో ఆయన గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి మళ్లీ మాట్లాడుకోవడం ప్రారంభించారు. బాలకృష్ణ కుమారుడిగా మోక్షజ్ఞ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
కొంతకాలం క్రితం దర్శకుడు ప్రశాంత్ వర్మతో.. మోక్షజ్ఞ తొలి సినిమా ప్రారంభమవుతుందని వార్తలు వచ్చాయి. ఆ సినిమా పూజా కార్యక్రమాల సమయంలోనే ఆగిపోయింది. దీంతో మోక్షజ్ఞ తొలి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో ఇంకా పెరిగింది.
ఇప్పుడీ పంచల ఫంక్షన్ ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు మోక్షజ్ఞ లుక్ గురించి మాట్లాడుతున్నారు. కొందరు అభిమానులు ఆయనలో హీరోగా నిలిచే సామర్థ్యం ఉందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆయన ఇంకా తన లుక్ మరియు ఫిజిక్పై మరింత శ్రద్ధ పెట్టాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మోక్షజ్ఞ తన ఫిట్నెస్, స్టైల్పై కాస్త ఎక్కువ దృష్టి పెడితే తన మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అందుకే నందమూరి అభిమానులు ఆయన సినిమా ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Swayambhu: స్వయంభూపై OTT షాకింగ్ డిమాండ్.. నిఖిల్ సినిమాకు మరో బాధ!