Sobhita Dhulipala: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే నటి శోభితా ధూళిపాళ్ల మరియు దుబాయ్ బేస్డ్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ శ్రీలత అడెపల్లి మధ్య జరిగిన సంభాషణ. తెలుగు మూలాలున్న మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఎలా రాణిస్తున్నారో వివరిస్తూ శ్రీలత చేసిన ఒక పోస్ట్, దానికి శోభితా ఇచ్చిన లోతైన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
Read also-విజయ్ రాజకీయ భవిష్యత్తుపై వేణుస్వామి జోస్యం..
శ్రీలత అడెపల్లి తన వీడియోలో ప్రపంచ వేదికలపై తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న తెలుగు మహిళలను కొనియాడారు. కేవలం సినిమా రంగమే కాకుండా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న వారిని ఆమె ప్రస్తావించారు. ఆ జాబితాలో నటి శోభితా ధూళిపాళ్ల, చానెల్ మోడల్ భవిత మండవ, ప్రముఖ ర్యాపర్ రాజా కుమారి, బ్యూటీ ఆంట్రప్రెన్యూర్ దీపికా ముత్యాల ఉన్నారు. తమ మూలాలను మర్చిపోకుండా, ఆత్మవిశ్వాసంతో గ్లోబల్ స్టేజ్పై రాణిస్తున్న వీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని శ్రీలత పేర్కొన్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు ఇటువంటి పోస్ట్లకు ‘థాంక్యూ’ లేదా ఒక ‘హార్ట్ ఎమోజీ’తో సరిపెడుతుంటారు. కానీ శోభితా ధూళిపాళ్ల మాత్రం ఎంతో లోతైన సందేశాన్ని రిప్లైగా ఇచ్చారు. ఆమె తన మనసులోని మాటలను ఇలా పంచుకున్నారు “ఏది ఏమైనా సరే, మీ అంతరాత్మను నమ్మండి. నా జీవితంలో అత్యంత అర్థవంతమైన క్షణాలు.. తర్కానికి అందకపోయినా, ఎలాంటి ఉపయోగం ఉండదని అనిపించినా నా మనసు చెప్పిన మాట విన్నప్పుడే కలిగాయి. అలా కాకుండా చేసిన ప్రతిసారీ నాకే ఎదురుదెబ్బలు తగిలాయి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఈ జీవితం నదిపై సాగే ఒక చిన్న ప్రయాణం లాంటిది.. ఆ ప్రవాహాన్ని, గాలిని ఆస్వాదించండి.”
Read also-రౌడీ జనార్ధన స్పెషల్ పోస్టర్.. “ప్రపంచంతో పోరాడే యోధుడు ప్రేమకు లొంగిపోతాడు”!
శోభితా ఇచ్చిన ఈ సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆమెలోని పరిణతిని, నిజాయితీని వేల సంఖ్యలో నెటిజన్లు అభినందిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మహిళలు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ, ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఇన్స్టాగ్రామ్ సంభాషణలా కాకుండా, ఈ వైరల్ మూమెంట్ మహిళా సాధికారతకు తమ మూలాలను గౌరవించుకోవడానికి ఒక నిదర్శనంగా నిలుస్తోంది.
?igsh=a2k3NDFlbXJxczFy