Vijaya Nirmala:తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో గొప్ప నటీమణులు ఉన్నారు. కానీ నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా కూడా గుర్తింపు పొందినవారిలో విజయనిర్మల ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆమె జీవితంలో జరిగిన కొన్ని విషయాలు చాలా మందికి తెలియవు. ముఖ్యంగా ఆమె మొదటి వివాహం గురించి చాలామందికి తెలియదు.
విజయనిర్మల 1946 ఫిబ్రవరి 22న జన్మించారు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుని బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తర్వాత హీరోయిన్గా కూడా మంచి పేరు సంపాదించారు. మొదట ఆమె తమిళ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. అప్పటికే నిర్మల అనే పేరు ఉన్న మరో నటి ఉండటంతో, ఆమె పేరుకు ముందు విజయ అనే పదం జత చేయడంతో ఆమె విజయనిర్మలగా మారింది.
తర్వాత ఆమె తెలుగులో మంచి కుటుంబం సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నటిగా మంచి గుర్తింపు పొందిన ఆమె, తర్వాత దర్శకురాలిగా మారి అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్ రికార్డు కూడా సాధించారు.
విజయనిర్మల వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని కీలక మలుపులు ఉన్నాయి. అందరూ విజయనిర్మల మొదటి భర్త కృష్ణ అనుకుంటారు కానీ..ఆమె మొదట కృష్ణమూర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన ఒక షిప్ డిజైన్ ఆఫీసర్గా పనిచేసేవారు. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడే తర్వాత ప్రముఖ నటుడైన నరేష్.
అయితే కాలక్రమేణా వారి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగాయి. ముఖ్యంగా విజయనిర్మల సినిమాల్లో బిజీగా ఉండటం, ఆమె కెరీర్పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది. కుటుంబ విషయాల్లో కొన్ని విభేదాలు రావడంతో చివరకు వారు విడిపోయారు.
తర్వాత ఆమె నటుడు కృష్ణతో పరిచయం పెంచుకున్నారు. కలిసి సినిమాలు చేయడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, తర్వాత వారు వివాహం చేసుకున్నారు. ఈ విధంగా విజయనిర్మల తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. అయితే అప్పటికే కృష్ణ కి కూడా పెళ్లయి.. మొదటి భార్యతో పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్య పిల్లలే రమేష్, మహేష్ బాబు. ఇక విజయనిర్మలకి మొదటి భర్తతో.. కలిగిన బిడ్డ నరేష్. విజయనిర్మల, కృష్ణకి మాత్రం పిల్లలు లేరు.
ALSO READ: Niharika Konidela: వాళ్లంతా కుక్కలు.. మొరుగుతారంతే.. నిహారిక షాకింగ్ కామెంట్స్