BigTV English

Delhi liquor scam case : ఢిల్లీ మద్యం స్కామ్ కేసు.. నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

Delhi liquor scam case : ఢిల్లీ మద్యం స్కామ్ కేసు.. నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

Delhi liquor scam case :


ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ వ్యవహారంలో నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ ఇద్దరు నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును కోరింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

నిందితులిద్దరికీ ఇంటి భోజనం తినేందుకు కోర్టు అనుమతించింది. వాటర్ ఫ్లాస్క్, రెండు జతల బట్టలు, చలి దుస్తులు, బూట్లు, అవసరమైన మందులు వాడేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. జైలులో ఇద్దరు నిందితులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని జైలు అధికారులను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కేసులో నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపైనా విచారణను నవంబర్ 24కి వాయిదా వేసింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×