E-Paper
Advertisement

kota Student Missing : వారం రోజుల్లో రెండో విద్యార్థి అదృశ్యం..

kota Student Missing : వారం రోజుల్లో రెండో విద్యార్థి అదృశ్యం..
Advertisement
kota Student Missing

18-year-old NEET aspirant Yuvraj missing in Kota : కోచింగ్ హబ్‌గా పేరొందిన రాజస్థాన్‌లోని కోటలో మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. విద్యార్థుల మిస్సింగ్ కేసులకు సంబందించి గత 7 రోజుల్లో ఇది రెండోది. సికార్ జిల్లాకు చెందిన యువ్‌రాజ్(18) ఇక్కడ ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో నీట్‌ మెడికల్ ఎంట్రన్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కోటలోని ట్రాన్స్‌పోర్ట్ నగర్ ప్రాంతంలోని హాస్టల్‌లో ఉంటున్న యువ్‌రాజ్ శనివారం ఉదయం కోచింగ్ సెంటర్‌కు చేరుకున్నాడు.

Read more : బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి..

Advertisement

అప్పటి నుంచి అతని ఆచూకీ లేదు. అదీగాక అతను తన మొబైల్ ఫోన్‌ను హాస్టల్‌లో వదిలి రావడంతో అనుమానాలకు ఆస్కారం కలుగుతోంది. వారం రోజుల క్రితమే రచిత్
సంధ్య(16) అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ విద్యార్థి జేఈఈకి సిద్ధమవుతున్నాడు. ఓ పరీక్షకు హాజరైన అనంతరం అతను ఓ క్యాబ్ ఎక్కడం సీసీటీవీ ఫుటేజిలో నమోదైంది.

ఓ ఆలయాన్ని సందర్శించిన అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అదే చివరిసారిగా అతనిని చూడటం. ఆలయం వద్దే రచిత్ బ్యాగ్, మొబైల్ ఫోన్, గది తాళాలు, ఇతర వస్తువులు పోలీసులకు లభ్యమయ్యాయి. ఆ టీనేజర్ ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. మిస్సింగ్ విద్యార్థుల కోసం గాలింపు సాగుతోంది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×