Kolkata Earthquake: దేశంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. బెంగాల్ లోని కోల్ కత్తా నగరంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టల్ స్కేలుపై 5.4 తీవ్రతో కదలికలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 1.22 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ లేదా మయన్మార్ లో ఈ భూకంప కేంద్రం నమోదై ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఫలితంగా కోల్ కతాతో పాటు బెంగాల్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రధానంగా కోల్ కతాలో భూకంప ప్రభావం ఉండటంతో నగరవాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఆఫీసులు, ఇళ్లు, షాపింగ్ మాల్స్ నుంచి బయటకు పరుగులు పెట్టారు.
మరోవైపు భూ ప్రకంపనలకు సంబంధించిన స్వీయ అనుభవాలను కోల్ కతా ప్రజలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. భూమి కంపించిన తీరును తెలియజేసే వీడియోలను నెట్టింట షేర్ చేస్తున్నారు. దీంతో ఆ దృశ్యాలు ఒక్కసారిగా ట్రెండింగ్ అవుతున్నాయి. గోడకున్న గడియాలు, ఫ్యాన్లు ఊగిపోవడం, వంటగదిలోని వస్తువులు కిందపడిపోయిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Huge Earthquake in Kolkata.#Earthquake #Kolkata pic.twitter.com/nnx2Y1u5St
— N M speaks (@Nmspeak) February 27, 2026
Strong tenors felt in #Kolkata .#Earthquake pic.twitter.com/SWXNKhPu4U
— Kamalika Sengupta (@KamalikaSengupt) February 27, 2026
Also Read: Flipkart AC Deals: కొత్త ఏసీ కావాలా? మీకిదే గోల్డెన్ ఛాన్స్.. ఫ్లిప్కార్ట్లో కళ్లుచెదిరే ఆఫర్లు!
EMSC డేటా ప్రకారం.. మయన్మార్ లోని అక్యాబ్ సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూమికి 6-10 కి.మీ లోతులో ఇది సంభవించి ఉండొచ్చని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ అంచనా వేసింది. ఫలితంగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్ తో పాటు భారత్ లోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ దీని ప్రభావం కనిపించిందని స్పష్టం చేసింది.
Also Read: Botsa Health: బొత్స సత్యనారాయణకు అస్వస్థత.. ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర చికిత్స