Flipkart AC Deals: సమ్మర్ లో ఏసీలకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిటైల్ స్టోర్లు, ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ లో పెద్ద ఎత్తున ప్రజలు ఏసీలను కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఏసీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. 30-50 శాతం రాయితీతో ఏసీలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే లభిస్తున్న టాప్ ఏసీలు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి.
పానాసోనిక్ కంపెనీకి చెందిన ఈ ఏసీని 35 శాతం రాయితీతో ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ.51,900 కాగా.. రూ.33,480కే సొంతం చేసుకోవచ్చు. 3 స్టార్ రేటింగ్, ఆటో రిస్టార్ట్, పెద్ద గదులను సైతం చల్లబరిచే సామర్థ్యం, దుమ్ము – దూళిని తొలగించే డస్ట్ ఫిల్టర్లు, వైఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లను ఇది కలిగింది.
వోల్టాస్ కంపెనీకి చెందిన ఈ ఏసీపై ఫ్లిప్ కార్ట్ ఏకంగా 48 రాయితీ అందిస్తోంది. ఫలితంగా రూ.59,790 ఏసీని రూ.30,990కే కొనుగోలు చేయవచ్చు. ఇది ఐస్ వాష్ టెక్నాలజీతో పనిచేస్తుంది. యాంటీ డస్టర్ ఫిల్టర్స్, సూపర్ డ్రై, 4 వర్కింగ్ మోడ్స్, స్టెబిలైజర్ అవసరం లేని ఆపరేషన్, మెమోరీ రీస్టార్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఒనిడా కంపెనీకి చెందిన బడ్జెట్ ఏసీని కోరుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. 36 శాతం రాయితీతో రూ.26,990కే ఈ ఏసీ లభిస్తోంది. 55 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పనిచేయగల సామర్థ్యం, తక్కువ శబ్దం, డీప్ ఫ్రోస్ట్ క్లీన్, సూపర్ ఎనర్జీ సేవింగ్ మోడ్, 2 రకాలు స్వింగ్ మోడ్స్ వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది.
ఎల్జీ కంపెనీకి చెందిన ఏసీని కోరుకునేవారు దీనిని పరిశీలించవచ్చు. దీనిపై ఫ్లిప్ కార్ట్ 47 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. రూ.41,490కి కొనుగోలు చేయవచ్చు. 5 స్టార్ రేటింగ్, 6 in 1 కూలింగ్ మోడ్స్, డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్, ఏఐ ఆధారిత కూలింగ్ అడ్జస్ట్ మెంట్, Viraat ఫాస్టర్ కూలింగ్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Also Read: New Acerpure ACs: ఏసర్ప్యూర్ చిల్ నియో ఏసీలు లాంచ్.. ఒకసారి ఆన్ చేస్తే.. దుప్పటి కప్పుకోవాల్సిందే!
ఈ గోద్రేజ్ ఏసీని 33 శాతం రాయితీతో రూ.28,490కి పొందవచ్చు. ఏఐ ఆధారిత ఐ సెన్స్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. 5 in 1 అడ్జస్టబుల్ కూలింగ్, 52 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ గదిని చల్లబరచగల సామర్థ్యం, సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ తదితర ఫీచర్లతో ఇది లభిస్తోంది.
Also Read: TG Health Mission: వచ్చే నెల మార్చి 2 నుంచి ఇక సమరమే.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ సంచలన నిర్ణయం..?