E-Paper
Advertisement

Aam Aadmi Party| ‘జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం.. కేంద్ర అధికార పార్టీకే లాభం!’

Aam Aadmi Party | దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ వన్ నేషన్ వన్ ఎలెక్షన్(జమిలి ఎన్నికలు)పై తన అభిప్రాయం వ్యక్తం చేసింది. జమిలి ఎన్నికలతో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం ఉందని, అందుకే ఆ ఎన్నికల విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రతినిధి పంకజ్ గుప్తా తెలిపారు.

Aam Aadmi Party| ‘జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం.. కేంద్ర అధికార పార్టీకే లాభం!’

Aam Aadmi Party | దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ వన్ నేషన్ వన్ ఎలెక్షన్(జమిలి ఎన్నికలు)పై తన అభిప్రాయం వ్యక్తం చేసింది. జమిలి ఎన్నికలతో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం ఉందని, అందుకే ఆ ఎన్నికల విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రతినిధి పంకజ్ గుప్తా తెలిపారు.

ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎన్నికల కమిటీ ముఖ్య కార్యదర్శి నితేన్ చంద్రాకు తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. ఒక లేఖ రాశారు. లేఖలో ఆయన పార్టీ అభిప్రాయలను వివరిస్తూ.. వన్ నేషన్ వన్ ఎలెక్షన్ లాంటి ఎన్నికల విధానం దేశ పార్లమెంట్ ప్రజాస్వామ్య విధానం, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని అన్నారు. ఎన్నికల ఫలితాల్లో హంగ్ పరిస్థితులొచ్చినప్పుడు జమిలి ఎన్నికలు విధానం పూర్తిగా విఫలం చెందుతుందని.. పార్టీ ఫిరాయింపులు చేసే నాయకులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఎన్నికల తరువాత ప్రత్యక్షంగానే ఎమ్మెల్యేల, ఎంపీల కొనుగోలు జరుతుందని చెప్పారు. ఎన్నికలు జరిగితే కేవలం కేంద్ర ప్రభుత్వంలోని అధికార పార్టీ మాత్రమే లాభపడుతుందని వ్యక్తం చేశారు.

ఎన్నికల ఖర్చు మిగులుతుందని చూపుతున్న కారణం చాలా చిన్నదని.. సాధారణంగా ఎన్నికలు జరిగే ఖర్చు.. దేశ వార్షిక బడ్జెట్‌లో కేవలం 0.1 శాతం ఖర్చుఅవుతుందని చెప్పుకొచ్చారు.

ఇప్పటికే పక్ష కూటమిలోని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు తాము జమిలి ఎన్నికల విధానానికి వ్యతిరేకమని ఓపెన్‌గానే చెప్పాయి.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×