E-Paper
Advertisement

Akhilesh Yadav: బీజేపీలో కుర్చీ కోసం కొట్లాట: అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: బీజేపీలో కుర్చీ కోసం కొట్లాట:  అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: బీజేపీ ప్రభుత్వం యూపీలో ఆదిత్య నాథ్ సారధ్యంలో అస్థిరతతో సతమతం అవుతోందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లక్నోలో అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అంతర్గత కుమ్ములాటతో కీచులాడుతోందని అన్నారు. కాషయ నేతల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధి అటకెక్కిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తోందని మండిపడ్డారు. అంతే కాకుండా రాష్ట్ర రాజధాని లక్నోలో గృహాల కూల్చివేత నిర్ణయాలన్ని వాయిదా వేసారని అన్నారు.

యోగి సర్కార్ బలహీనపడుతుందనేది విస్పష్ట సంకేతమని చెప్పారు. ఇదిలా ఉంటే ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్య నాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేధాలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. మరో వైపు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశం అయ్యారు.

అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలపై కేశవ్ మౌర్య స్పందిస్తూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉందని అన్నారు. 2015 ఎన్నికల ఫలితాలు 2027లో కూడా రిపీట్ అవుతాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం యూపీ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత వీరి మధ్య విభేదాలు మరింతగా పెరిగినట్లు, ఈ నేపధ్యంలోనే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా యూపీలో పార్టీ వ్యూహాన్ని రూపొందించడానికి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది.

Also Read: గోడ దూకివచ్చిన ఫ్లైయింగ్ స్క్వాడ్.. అడ్డంగా దొరికిన టీచర్లు

మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో 80 లోక్‌సభ స్థానాలను సమాజ్ వాదీ పార్టీ, ఇండియా కూటమి 43 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 35 స్థానాలకు పరిమితమైంది. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తక్కువ స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

 

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×