BigTV English
Advertisement

Nadda’s house Discuss portfolios: బీజేపీ నేతల మీటింగ్, చంద్రబాబు, నితీష్‌ డిమాండ్లపై చర్చ

Nadda’s house Discuss portfolios: బీజేపీ నేతల మీటింగ్, చంద్రబాబు, నితీష్‌ డిమాండ్లపై చర్చ

Nadda’s house Discuss portfolios: ఢిల్లీలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. రెండు రోజుల్లో నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకుంది బీజేపీ. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఇరుగుపొరుగు దేశాల అధ్యక్షులను పిలుస్తోంది.


ఇదిలావుండగా గురువారం మధ్యాహ్నం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్ షాతోపాటు సీనియర్లు, ఆర్ఎస్ఎస్ నేతలు భేటీ అయ్యారు. ఎన్డీయేకు వచ్చిన మెజార్టీ గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో ఎన్డీయే మిత్రులు కోరుతున్న మంత్రుల శాఖలపై ఆయా నేతలు చర్చించినట్లు ఢిల్లీలో వార్తలు జోరందుకున్నాయి.

బీహార్ సీఎం నితీష్‌కుమార్.. స్పెషల్ స్టేటస్‌తోపాటు కీలకమైన మూడు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటిలో రైల్వేలు, గ్రామీణాభివృద్ధి, జల్‌శక్తి లేదా వ్యవసాయ శాఖ అడిగినట్టు సమాచారం. మిత్రులు ఎక్కువ శాఖలు కోరడంతో ఈసారి కొంతమంది నేతలకు మంత్రి పదవులు దక్కడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.


ALSO READ:  రాహుల్ ఎటు వైపు మొగ్గు? సర్వత్రా ఆసక్తి..

టీడీపీ కూడా ఏపీకి స్పెషల్ ప్యాకేజ్, కేపిటల్ అభివృద్ధికి నిధులు, స్పీకర్, షిప్పింగ్, ఐటీ, గ్రామీణాభి వృద్ధి, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు శాఖలపై చర్చ జరిగినట్టు సమాచారం. మరి భేటీలో ఆయా నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గెలిచిన ఎంపీలంతా ఢిల్లీకి రావాలని పీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక ఎన్డీయే మిత్రులకు బుధవారం రాత్రి మోదీ, ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మొత్తానికి మరి మంత్రుల శాఖల గురించి శుక్రవారం సాయంత్రానికి ఓ కొలిక్కి రావచ్చని అంటున్నారు.

Tags

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×