BigTV English
Advertisement

Rahul Gandhi choose: రాహుల్ ఎటు వైపు మొగ్గు? సర్వత్రా ఆసక్తి..

Rahul Gandhi choose: రాహుల్ ఎటు వైపు మొగ్గు? సర్వత్రా ఆసక్తి..

Rahul Gandhi latest news(Political news telugu): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి కొత్త సమస్య ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ గెలిచారు. ఒకటి కేరళలోని వయనాడ్, మరొకటి ఫ్యామిలీకి కంచుకోట ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం. ఈ రెండింటిలో ఆయన ఎటు వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. తనను రెండుసార్లు ఆదరించిన వయనాడ్‌ను వదిలేస్తారా? లేక ఫ్యామిలీకి కంచుకోట రాయ్‌బరేలి సీటుకు రాజీనామా చేస్తారా? ఇవే ప్రశ్నలు కాంగ్రెస్ నేతలను వెంటాడు తున్నాయి.


చాలావరకు రాహుల్‌గాంధీ కేరళ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి మాత్రమే గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారాయన. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వారిటో రెండు ఎస్టీ, మరొకటి ఎస్సీ స్థానం. వయనాడ్‌లో క్రైస్తవ, ముస్లిం వర్గాల ఓట్లు ఎక్కువ. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇక్కడ బలంగా ఉంది. ఇక్కడి నుంచి అయితే సౌత్‌లో పార్టీకి ఊపు వస్తుందని అంటున్నారు.

2019 ఎన్నికల్లో అమేథి నుంచి ఓటమి పాలయ్యారు రాహుల్ గాంధీ. ఈసారి అక్కడి నుంచి కిశోరీ‌లాల్ శర్మ బరిలోకి దిగడం, విజయం సాధించడం జరిగిపోయింది. సోనియా ఫ్యామిలీకి రాయ్‌బరేలీ కంచుకోట కావడంతో అక్కడి నుంచి ప్రియాంకను బరిలోకి దించుతారా? అన్న ప్రశ్న రైజ్ అవుతోంది.


ALSO READ: బీజేపీకి భారీ షాక్.. బిగ్ ఆఫర్ ప్రకటించిన ఖర్గే

గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాంరమేష్ ఓ విషయాన్ని ప్రస్తావించారు. ప్రియాంక దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని, ప్రస్తుతం ఆమె పోటీ చేయరని అన్నారు. ఎక్కడైనా బైపోల్ వస్తే ప్రియాంక పోటీ చేసే ఛాన్స్ ఉందని ఒకానొక సందర్భంలో చెప్పారు. ఈ లెక్కన ఆమె బరిలోకి దిగడం ఖాయమని అంటున్నారు. మరోవారం ఆగితే దీనిపై క్లారిటీ రావడం ఖాయమని అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×