E-Paper
Advertisement

Arvind Kejriwal Bail Petition: లిక్కర్ కేసు.. సీఎం కేజ్రీవాల్‌కు నిరాశ.. జూన్‌ 26న సుప్రీంకోర్టులో..

Arvind Kejriwal Bail Petition: లిక్కర్ కేసు.. సీఎం కేజ్రీవాల్‌కు నిరాశ.. జూన్‌ 26న సుప్రీంకోర్టులో..

Update on Arvind Kejriwal Bail Petition: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు నిరాశే ఎదురైంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాపీ చూడకుండా ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది న్యాయస్థానం.

ఇంకా లోతుల్లోకి వెళ్తే.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది ట్రయిల్ కోర్టు. దీనిపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది ఈడీ. వెంటనే కింది కోర్టు ఆదేశాలపై 24 గంటల్లో స్టే ఇచ్చింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్.

కేజ్రీవాల్ వేసిన పిటీషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తర్వాతే దానిపై పరిశీలన చేస్తామని వెల్లడించింది. తీర్పు కాపీ చూడకుండా ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. దీంతో పిటిషన్‌పై విచారణ జూన్ 26న(బుధవారం) చేపడతామని స్పష్టం చేసింది.

Also Read: పీఎం మోదీకి ఖర్గే కౌంటర్.. ఇంకెంతకాలం అవే మాటలు

గతవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసేందుకు తమకు 48 గంటలు గడువు ఇవ్వాలని ఈడీ కోరినప్పటికీ న్యాయస్థానం తిరస్కరించింది. మరుసటి ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది ఈడీ. తమ వాదనలు వినేందుకు గడువు ఇవ్వలేదని అందులో ప్రస్తావించారు. వారి వాదనలో ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు, ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారాయన.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×