E-Paper
Advertisement

Arvind Kejriwal: ఆ పార్టీ లో చేరాలని బలవంతం చేశారు.. కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు..

Arvind Kejriwal: ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు

Arvind Kejriwal: ఆ పార్టీ లో చేరాలని బలవంతం చేశారు.. కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు..

Arvind Kejriwal: ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని ఆ పార్టీ నేతలు బలవంతం చేసినట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఆప్‌ సభ్యులను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందన్న ఆరోపణల కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో రోహిణి పాఠశాలకు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు.

బీజేపీ తమపై ఎన్నో కుట్రలు పన్నుతోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తనను ఆ పార్టీలో చేరమంటున్నారన్నారు. అలా చేస్తే..ఎలాంటి కేసులు పెట్టకుండా వదిలేస్తారన్నారని పేర్కొన్నారు. కానీ, వాళ్లకు తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎప్పటికీ తాను బీజేపీ మోచేయి నీరు తాగనన్నారు. అదే మాటను వాళ్లకు తెగేసి చెప్పానన్నారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆస్పత్రులు, పాఠశాలల అభివృద్ధికి బడ్జెట్‌లో కేవలం 4 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి ఏటా 40 శాతం నిధులు వైద్యం, విద్య కోసం మంజూరు చేస్తోందని కేజ్రీవాల్‌ అన్నారు. బీజేపీ పార్టీకి తలవంచలేదనే కారణంతోనే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా, మరో మంత్రి సత్యేంద్రజైన్‌ను జైల్లో పెట్టించారని ఆయన విమర్శించారు. అన్ని దర్యాప్తు సంస్థలు ఆప్‌ నేతలవైపే చూస్తున్నాయన్నారు. అత్యాధునిక పాఠశాలలు నిర్మించడమే సిసోదియా చేసిన నేరమా? అని ప్రశ్నించారు.

ఆప్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని జనవరి 27న మంత్రి ఆతిశీ, సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఒక్కో సభ్యుడికి రూ.25 కోట్లు ఇవ్వజూపినట్లు వారు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ కూడా ఆఫర్‌ చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రస్తుతం ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×