BigTV English

Assam: మైనర్లను పెళ్లాడిన వారికి జైలు శిక్ష తప్పదు.. సీఎం హెచ్చరిక

Assam: మైనర్లను పెళ్లాడిన వారికి జైలు శిక్ష తప్పదు.. సీఎం హెచ్చరిక

Assam: బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా… ఎక్కడో ఓ దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అధికారులు బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న వయస్సులోనే పెళ్లి కావడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఈక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గువాహటిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మైనర్లను పెళ్లి చేసుకున్న వారిని అతి త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు. రాబోయే ఐదారు నెలల్లో ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకొని భర్తలైన వారిని ఎవరినీ వదిలిపెట్టేలి లేదని స్పష్టం చేశారు.

మైనర్లను వివాహం చేసుకున్న వారిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. నిందితులు యావజ్జీవ కారాగార శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మాతృత్వం పొందడానికి అనువైన వయస్సు 22 నుంచి 30 ఏళ్లు అని.. ప్రతీ దానికి తగిన వయసు ఉండేలా దేవుడు మన శరీరాలను రూపొందించాడని హిమంత బిశ్వశర్మ తెలిపారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×