E-Paper
Advertisement

Taraka Ratna: తారకరత్న పోరాడుతున్నారు.. చికిత్సకు స్పందిస్తున్నారు.. పరిస్థితి నిలకడగానే ఉంది..

Taraka Ratna: తారకరత్న పోరాడుతున్నారు.. చికిత్సకు స్పందిస్తున్నారు.. పరిస్థితి నిలకడగానే ఉంది..
Advertisement

Taraka Ratna: నందమూరి తారకరత్న పరిస్థితి నిలకడగా ఉందని బాలకృష్ణ తెలిపారు. బెంగళూరు నుంచి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయనకు స్టంట్ వేయడం కుదరదని.. తిరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని వివరించారు. తారకరత్న కోసం వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని వెల్లడించారు.

తారకరత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తారకరత్న పోరాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. క్రిటికల్ కండీషన్ నుంచి బయటపడ్డారని చెప్పలేం అని అన్నారు.

Advertisement

కాగా, నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన్ను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత కుప్పంలోని పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో చేర్పించి… శుక్రవారం అర్ధరాత్రి వరకూ చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో ఐసీసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. తారకరత్న వెంట సతీమణి అలేఖ్యరెడ్డి, బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×