BigTV English
Advertisement

Mallikarjun Kharge: బీజేపీకి భారీ షాక్.. బిగ్ ఆఫర్ ప్రకటించిన ఖర్గే

Mallikarjun Kharge: బీజేపీకి భారీ షాక్.. బిగ్ ఆఫర్ ప్రకటించిన ఖర్గే

India bloc Meeting: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. నైతికంగా పరాజయం పొందినప్పటికీ ప్రజా విధానాలకు వ్యతిరేకంగా మోదీ పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ప్రతిపక్షాల ఇండియా బ్లాక్ సమావేశం నిర్వహించింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు, కూటమి భవిష్యత్తు గురించి నేతలు చర్చించారు.


లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేసిన ఇండియా కూటమిలోని భాగస్వాములంతా ఐక్యంగా ఉన్నారని ఖర్గే అన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎన్నికల తీర్పు ఉందని తెలిపారు. స్పష్టమైన నైతిక పరాజయం ఉందని అన్నారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్న అన్ని పార్టీలకు ఇండియా కూటమి స్వాగతం పలుకుతోందన్నారు.

ప్రతిపక్షాల ఇండియా బ్లాక్ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ అగ్ర నేతలు హాజరయ్యారు. తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, సీపీఎం నేత సీతారం ఏచూరితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఖర్గే ఆహ్వానించారు.


Also Read: సీఎం పదవికి నవీన్ పట్నాయక్ రాజీనామా.. కొత్త సీఎం ఈయనే?

ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి తీర్మానం చేసుకుంది. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాటం చేస్తుందని వెల్లడించింది. అంతే కాకుండా ప్రతిపక్షానికి మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు కూటమి తరపున ఖర్గే ధన్యవాదాలు తెలిపారు.

 

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×