BigTV English
Advertisement

Bird Flu: వేగంగా వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రంలో గుడ్లు, చికెన్ విక్రయాలపై నిషేధం

Bird Flu: వేగంగా వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రంలో గుడ్లు, చికెన్ విక్రయాలపై నిషేధం

 


Bird Flu: జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తుంది. దీంతో చికెన్, కోడిగుడ్ల విక్రయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రాంచీలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు కనిపించడంతో జార్ఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అదే సమయంలో, కోళ్లు, బాతులలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని తేలడంతో ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్ హోత్వార్‌లో 1745 కోళ్లు, 450 బాతులు సహా దాదాపు 2195 పక్షులను చంపేయాలని ఆదేశించింది. రాంచీలోని హోత్వార్‌లో H5N1 బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన తర్వాత రాష్ట్రం మొత్తాన్ని ప్రభుత్వం అలర్ట్ చేసింది. ప్రస్తుతం రాంచీలో కంటైన్‌మెంట్ జోన్‌ను ఏర్పాటు చేశారు. 1 కిలోమీటరు పరిధిలో ఎలాంటి కోళ్లు, బాతులు, గుడ్లు కనిపించినా.. వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ధ్వంసం చేయాలని అడ్మినిస్ట్రేషన్ టీమ్ ఆదేశించింది.

సాధారణ వైరస్‌ల మాదిరిగానే, ఈ వైరస్ జంతువులు, పక్షులతో పాటు మానవులకు కూడా సోకగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, రాంచీలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫారమ్‌లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన వెంటనే, అక్కడ పనిచేస్తున్న పౌల్ట్రీ ఫామ్‌లోని 2 వైద్యులతో సహా 6 మంది ఉద్యోగులు క్వారంటైన్ చేశారు. అంతే కాకుండా పౌల్ట్రీ ఫారం పరిసర ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.


మరోవైపు రాంచీ నుంచి ఇతర నగరాలకు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రాంచీలోని హోత్వార్ ప్రాంతంలో చికెన్, గుడ్ల అమ్మకాలను ప్రభుత్వం వెంటనే నిషేధించింది. అంతే కాకుండా కోళ్లను ఒక చోట నుంచి మరో చోటికి తీసుకురావడం, రవాణా చేయడంపై కూడా పూర్తి నిషేధం విధించింది. అదే సమయంలో చికెన్, గుడ్లు తినవద్దని వైద్యులు సూచించారు.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×